యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ సమావేశం
జగన్ రెడ్డి అవినీతి, అరాచక పాలనను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ కమిటీ తొలిసారి భేటీ అయ్యింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చించారు.
జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో పాటు నాలుగేళ్లుగా రాష్ట్రంలో అవినీతి తప్పా అభివృద్ది లేదు అన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం, పోలవరం, నిర్వీర్యం, అమరావతి నాశనం వంటి అంశాలను ప్రజలకు వివరించాలి. వాటితో పాటు యువతకు ఉపాధి కరువు, రైతులకు గిట్టుబాటు లభించకపోవడం, చార్జీల పెంపు, ధరల మోత, మహిళల రక్షణ లాంటి అంశాలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగేలా కార్యాచరణ రూపకల్పనపై చర్చించారు.
నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయి వరకూ తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగించాలని రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ సమావేశంలో నిర్ణయించారు. గురజాల మాల్యాద్రి, వేపాడ చిరంజీవి రావు, జివి రెడ్డి, ఎన్ విజయ్ కుమార్, వీరంకి వెంకట గురుమూర్తి, అంకయ్య చౌదరి, గాజుల ఆదెన్న, తోపూరి గంగాధర్ ,బి. రామాంజనేయులు సమావేశంలో పాల్గొన్నారు.