సిగ్గులేని సమాజాన్ని నిగ్గదీసి అడగటానికి…. సిరివెన్నెల కూడా లేడు

రాజకీయాలలో నేరస్తుల ప్రమేయం దేశానికి నష్టమని ఊహ తెలిసినప్పటి నుంచి చదువుతున్నాను. కానీ నేరస్తులే రాజకీయ నాయకులై పాలకులైతే వ్యవస్థలు ఏ స్థాయిలో పతనమవుతాయో….ప్రత్యక్షంగా చూస్తున్నాను.
అధికారం,ఆర్థిక బలం, మీడియా, మాఫియా ఉన్నవాళ్లు నాలుగు రోజుల్లో తేలిపోయే కేసులను కూడా నాలుగు సంవత్సరాలు పాటు నడిపించగలరు.అమాయకులను ఇరికించగలరు. కేంద్ర ప్రభుత్వాలు చూస్తూ ఉంటాయి,జనం ఓట్లు వేస్తూ ఉంటారు.
ఈ సిగ్గులేని సమాజాన్ని నిగ్గదీసి అడగటానికి….ఇప్పుడు సిరివెన్నెల కూడా లేడు.
ఒక మత పిచ్చి.. దేశాన్ని నాశనం చేస్తే, ఇంకో మత పిచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసింది.
ధర్మసంస్థాపనార్ధాయ….సంభవామి…యుగే యుగే. .ఆమెన్!

– డాక్టర్ కొలికపూడి శ్రీనివాస రావు

 

Leave a Reply