Suryaa.co.in

Telangana

ఈనెల 3 తర్వాత బిఆర్ఎస్ సర్కార్ ఉండదు

-కెసిఆర్ ట్రాపులో పడే పరిస్థితిలో ప్రజలు లేరు
-బిఆర్ఎస్ పాలకుల బినామీలకు రిజిస్ట్రేషన్ చేసిన చర్యలు తప్పవు
-ధరణిలో తప్పుగా నమోదు చేయొద్దు .. రిజిస్ట్రేషన్లు చేయొద్దు
– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్

హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది ఎకరాల అసైన్డ్ భూములను ధరణిలో తప్పుగా నమోదు చేయించి ప్రభుత్వ పెద్దల బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయడానికి బిఆర్ఎస్ పాలకులు కసరత్తు చేస్తున్నారు. లక్షల కోట్ల విలువైన భూములు ప్రజలకు ప్రభుత్వానికి చెందకుండా బీఆర్ఎస్ అక్రమంగా కాజేయాలని కుట్ర చేస్తున్నది. రెవిన్యూ శాఖను అప్రమత్తం చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం ధరణిలో తప్పుగా నమోదు చేయొద్దు రిజిస్ట్రేషన్లు చేయొద్దు.

ఈనెల 3 తర్వాత బిఆర్ఎస్ సర్కార్ ఉండదు. కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు చెప్పినట్టుగా అధికారులు భూములను ధరణిలో తప్పుగా నమోదు చేసిన బిఆర్ఎస్ పాలకుల బినామీలకు రిజిస్ట్రేషన్ చేసిన చర్యలు తప్పవు. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసినప్పటికీ రైతు బంధు రైతుల ఖాతాల్లో వేయకుండా కేసీఆర్ ప్రభుత్వం కావాలని కుట్రలు చేసి అడ్డుకుంది.

రైతుబంధు డబ్బులను ఎన్నికల్లో వనరులు సమకూర్చిన కాంట్రాక్టర్లకు కమిషన్లు దండుకొని వేల కోట్ల బిల్లులు రిలీజ్ చేయడానికి వీఆర్ఎస్ పాలకులు సిద్ధపడినట్లు సమాచారం. ఇది రాష్ట్ర ఖజానాకి, ప్రజల సంపదకు నష్టం. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు నిర్ణయాలు చేయొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖను హెచ్చరిస్తున్నాం,

ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి అధికార బదిలీ అవుతున్న క్రమంలో, అడ్డగోలు వ్యవహారాలు చేయకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తున్నాం. అధికారులు బిఆర్ఎస్ ట్రాప్ లో పడవద్దు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒత్తిడిలకు లొంగి తప్పులు చేయొద్దు బిఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు తప్పుల తడకపైన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రివ్యూ చేస్తుంది బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరిగే సమయంలో కాంగ్రెస్ ఏజెంట్లు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన చోట గెలవలేదని ఓటమి చెందారని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేసిన దాఖలాలు ఉన్నాయి. గతంలో తుంగతుర్తి హుజూర్నగర్ మంచిర్యాల ఇబ్రహీంపట్నం ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థులు తక్కువ మెజార్టీతో గెలిచిన ఓటమి చెందారని బిఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజలకు చూపించింది.

ప్రస్తుతం ఉన్న అపధర్మ బిఆర్ఎస్ ప్రభుత్వం. కౌంటింగ్ తర్వాత పూర్తిగా అధికారాన్ని కోల్పోతుంది. ఈ క్రమంలో ఎలాంటి ఆగడాలు తప్పిదాలు చేయడానికి అయినా సిద్ధపడి ఉంటారు. బిఆర్ఎస్ పార్టీ కుట్రలను తిప్పికొట్టే విధంగా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నుంచి సర్టిఫికెట్ ఇచ్చేవరకు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని టిఆర్ఎస్ నాయకులు బింకం మాటలు చెబుతున్నారు.

కౌంటింగ్ జరిగే చోట అవకతవకలు పాల్పడడానికి మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని బిఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతున్నది. ధరణి పేరిట భూములు కాజేయడానికి, కమిషన్ల కోసం బిల్లులు విడుదల చేయడానికి మళ్లీ అధికారంలోకి వస్తున్నామని బింకం మాటలు మాట్లాడుతుండ్రు. ప్రజలు కోరుకున్న మార్పు రాబోతున్నది. మార్పు కోసం ప్రజలు ఓట్లు వేసినందుకు కృతజ్ఞతలు. కెసిఆర్ ట్రాపులో పడే పరిస్థితిలో ప్రజలు లేరు

LEAVE A RESPONSE