వనదేవతలకు కేంద్ర మంత్రుల మొక్కులు

దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరను పురస్కరించుకొని మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణు సింగ్ హెలికాఫ్టర్ లో మేడారం వచ్చారు. వీరికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు స్వాగతం పలికారు. కలెక్టర్ జాతర ఏర్పాట్ల పై వారికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, కిషన్ రెడ్డి ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు.

అక్కడి నుండి నేరుగా తల్లుల దర్శనానికి గద్దెల వద్దకు చేరుకుని తూలబారంలో నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. అమ్మల గద్దెల వద్దకు వెళ్లి దర్శనం చేసుకొని మొక్కులు అప్పజెప్పారు. గిరిజన
kishan
సంక్షేమ శాఖ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా తో కలిసి ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణా ఆదిత్య వారికి మెమోంటో.. అదే విధంగా గిరిజన కలలు ఉట్టిపడేలా భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన కళాకారులచే ప్రత్యేకంగా రూపొందించిన పంచపాండవుల కళారూపాన్ని బహుకరించారు.

ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ములుగులో గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు పనులు త్వరతగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కేంద్ర
kishan2
ప్రభుత్వం గిరిజన హక్కులు సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. జార్ఖండ్ తరహాలో హైదరాబాద్ లో గిరిజన మ్యూజియంకు 15 కోట్లు మంజూరు చేశామన్నారు. ఇప్పటికే కోటి రూపాయల నిధులు విడుదల చేశామని.. రాష్ట్ర ప్రభుత్వంచే స్థల సేకరణ పూర్తి అవ్వగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీం కింద ఆలయాలు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇప్పటికే పలు హరిత హోటల్స్ రిసార్ట్స్ నిర్మించామన్నారు.

గిరిజన ప్రజలు ప్రతిష్టాత్మకంగా ప్రతి రెండేళ్ల కొకసారి నిర్వహించుకొనే అద్భుతమైన ఈ పండగ గురించి.. దేశ వ్యాప్తంగా ప్రచారానికి కృషి చేస్తామన్నారు. ప్రజా, దేశ సంక్షేమానికి అమ్మ వారి దీవెనలు అందజేస్తున్నారని.. కరోన మహమ్మారి నుండి ప్రజలందరినీ రక్షించాలని అందరికి మంచి జరగాలని తల్లులను కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణు సింగ్ మాట్లాడుతూ.. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర గిరిజన విశ్వవిద్యాలయ పనులు
kishan3 చేపడతామన్నారు. ప్రధానమంత్రి మార్గదర్సకత్వంలో ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ప్రత్యేకంగా గిరిజన శాఖపై ప్రధాని ప్రత్యేకంగా దృష్టి సారించారన్నారు. గిరిజన సంక్షేమానికి ప్రధానమంత్రి జన్ జ్యోతి అధివికాస్ యోజన పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 34 వేల గ్రామాలను అభివృద్ధి చేశామని తెలిపారు.

Leave a Reply