– ఒక ఎకరం 99 పైసలకే ఇచ్చారన్న వార్తలో వాస్తవం లేదన్న సంస్థ
– రాజకీయ లబ్ది కోసం పెట్టుబడులు పెట్టేవారిపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం తప్పు
– కేశినేని చిన్నీకి సంస్థకు ఎటువంటి సంబంధం లేదు
– ప్రభుత్వ పాలసీ ప్రకారమే మాకు భూ కేటాయింపులు జరిగాయి.
– జూమ్ కాల్ ద్వారా నిజానిజాలను బట్టబయలు చేసిన ఉర్సా క్లస్టర్ ఫౌండర్ జయ్ తాళ్లూరి, సతీష్ అబ్బూరి
రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించిన ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరుగకుండా ఆపేందుకు కుట్రలు చేస్తున్నారని, యువతకు మేలు చేద్దామని మేము వస్తే మాపై నిందలు వేస్తున్నారని అన్న ఉర్సా ఫౌండర్ జై తాళ్లూరి. జూమ్ కాల్ ద్వారా మీడియాకు నిజానిజాలు తెలిపిన ఉర్సా ఫౌండర్.
“ఉర్సా అనేది రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన సంస్థ కాదు. అమెరికాలో రిజిస్టర్ అయిన కంపెనీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. భారతదేశ నిబంధనల ప్రకారం ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉండాలనే చెప్పడంతో హైదరాబాద్ నుంచి టెంపరరీ అడ్రెస్తో రిజిస్ట్రేషన్ చేశాం. వందల మంది ఉద్యోగులు రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తే పుట్టుకొచ్చిన సంస్థ ఉర్సా క్లస్టర్స్.
మేము పెట్టే పెట్టుబడి ఆర్బిఐ అప్రూవ్ చేసిన FDI పాలసీతో ఏపికి వస్తుంది. అన్ని నిబంధనలు ఇందులో పాటించాం. కష్టపడిన సొమ్ముతో మేము కంపెనీ పెడితే.. మా టీమ్పై కూడా నిందలు వేస్తున్నారు. టెక్నాలజీ బెస్ట్ ఎంటర్ ప్రైజెస్లను నిర్వహించడంలో దశాబ్దాల అనుభవం మా టీమ్ కు ఉంది. మా టీమ్ మెంబర్స్ సతీష్ అబ్బూరి, ఎరిక్ వార్నర్, కౌశిక్ పెందుర్తిలకు దశాబ్దాలుగా వివిధ రంగాల్లో, స్ధాయిలో పనిచేసిన అనుభవం ఉంది.
అమెరికాలో ఉన్నత స్థాయిలో టర్నోవర్ ఉన్న కంపెనీ మాది. ఏమైనా అనుమానాలు ఉంటే మా దగ్గరకు వచ్చి ఎన్డీఏపై సంతకం చేస్తే మా సంస్థ వెనక ఎవరున్నారు.. ఎవరు సహకరిస్తున్నారు.. ఏమి చేస్తామో పూర్వపరాలతో సహా వివరిస్తాం. ఇవేమి తెలుసుకోకుండా ఇష్టంవచ్చినట్లు రాతలు రాస్తున్నారు. ఎవరి దగ్గరో మెప్పు పొందేంకు లేదా రాజకీయ లబ్దీ కోసం మాపై విషం చిమ్ముతున్నారు. ఇలా నిందలు వేసి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. రాష్ట్రానికి నష్టం చేకూర్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.” అని అన్నారు.
రూ.99 పైసలకే ఎకరం భూమి ఇచ్చారనే వార్తలు వాస్తవం లేదు
“మేము రావడం మీకేమైన ఇష్టం లేకపోతే.. లేదా ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి మేము కార్యకలాపాలు మొదలుపెట్టకపోతే అప్పుడు మమ్మల్ని ప్రశ్నించే హక్కు వారికి ఉంటుంది. రూ. వేల కోట్లతో భూమి కొని ఎవరైనా వ్యాపారం చేయగలరా? ఆ ఫీజిబిలిటీ ఉంటుందా? మాకు రూ.99 పైసలకే ఎకరం ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాలసీ ప్రకారమే ఎకరం రూ.50 లక్షల చొప్పున 56.6 ఎకరాలు, ఎకరం రూ.కోటి చొప్పున 3.5 ఎకరాలు చొప్పున చెల్లిస్తున్నాం.
రూ.5,7283 కోట్ల పెట్టుబడితో 3 ఫేజుల్లో 300 మోగా వాట్ల సామర్ధ్యంతో 2 వేల మందికి ఉపాధి కల్పింస్తామని మేము ముందుకు వచ్చాయం. అందుకోసం 150 ఎకరాలు కావాలని అడిగినా మాకు తగ్గించే ఇచ్చారు. మాకు భూమి కేటాయించేటప్పుడే 2 ఏళ్లు డెడ్ లైన్ను ప్రభుత్వం మాకు విధించింది. మేము చేయలేని పక్షంలో మాకిచ్చిన భూమిని తిరిగి ప్రభుత్వం తీసుకొని ప్రాజెక్టును రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది.
నిజానిజాలు తెలియకుండా మా సంస్థపై విషం చిమ్ముతున్నారు. విషం చిమ్ముతున్న వారికి ఏపీకి పెట్టుబడులు రావడం, రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేదు. మాపై నిందలు వేస్తే కొత్తగా వచ్చే కంపెనీలు సైతం మాకెందుకు అని తిరిగివెళ్ళేపొతాయనే దురుద్దేశంతో చేస్తున్న పనే ఇదంతా.
కేశినేని చిన్ని మాకు సంబంధం లేదు: సతీష్ అబ్బూరి
ఎంపీ కేశినేని చిన్నికి మా సంస్థకు ఎటువంటి సంబంధం లేదు. కేశినేని నాని మాపై ఎందుకు బురద జల్లుతున్నారో వారినే అడగాలి. మా సంస్థ యొక్క టర్నోవర్ ఎంటి? ఏఐ రంగంలో మా సంస్థ ఏ స్థాయిలో ఉందో నిజానిజాలు తెలుసుకోవాలి. ఏదో బురద జల్లుతామంటే కుదరదు.