– అతి త్వరలో యావత్ ప్రపంచం మోదీ తెగువ, పట్టుదలను చూడబోతోంది
– పెహల్ గాం ఘటనతో దేశ ప్రజలంతా ఆవేశంతో రగిలిపోతున్నారు
– హిందువుల సత్తా చాటేలా ఈనెల 22న కరీంనగర్ ‘‘హిందూ ఏక్తా యాత్ర’’
– తెలంగాణవ్యాప్తంగా జరగబోయే ఏక్తా యాత్రలకు స్పూర్తిగా నిలుద్దాం
– లక్ష మందితో కరీంనగర్ లో హిందు ఏక్తా యాత్ర నిర్వహిస్తాం
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
– కరీంనగర్ లో బీజేపీ నాయకులతో కలిసి ‘హిందూ ఏక్తా యాత్ర’ సన్నాహక సమావేశం నిర్వహించిన బండి సంజయ్
కరీంనగర్: పెహల్ గాం’’ ఘటనతో దేశ ప్రజలంతా ఆవేశంతో రగిలిపోతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో యావత్ దేశ ప్రజలంతా గల్లా ఎగరేసుకునేలా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందని చెప్పారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న కమిట్ మెంట్, తెగువ, ధైర్య సాహసాలు అతి త్వరలోనే యావత్ ప్రపంచం చూడబోతోందన్నారు. ప్రస్తుతం దేశంలోని ప్రజలంతా ఐక్యత చాటాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
అందులో భాగంగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 22న కరీంనగర్ లో కనీవినీ ఎరగని రీతిలో ‘హిందూ ఏక్తా యాత్ర’ను నిర్వహించబోతున్నామని ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఒక్క హిందువు ఈ యాత్రకు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణవ్యాప్తంగా భవిష్యత్తులో జరగబోయే హిందూ ఏక్తా యాత్రలకు కరీంనగర్ స్పూర్తిగా నిలవబోతోందన్నారు.
కరీంనగర్ రేకుర్తిలోని మహాలక్ష్మీ గార్డెన్ లో హిందూ ఏక్తా యాత్ర ఏర్పాట్లపై సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బండి సంజయ్ తోపాటు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, నగర మేయర్లు సునీల్ రావు, డి.శంకర్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన వందలాది మంది బీజేపీ నాయకులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు….
ప్రతి ఏటా కరీంనగర్ లో నిర్వహించే హిందూ ఏక్తా యాత్ర కోసం ప్రపంచంలోని హిందువులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విదేశాల్లో ఉండే హిందువులు సైతం ఆరోజు యాత్రలో పాల్గొని హిందువుల ఐక్యతను చాటి చెబుతారు. హిందూ ఏక్తా యాత్ర తరువాత కరీంనగర్ లో చాలా మేరకు బలవంతపు మతమార్పిడులు, లవ్ జిహాదీలు ఆగిపోయాయి. అయితే పెహల్ గాంలో ఉగ్రవాదుల జరిపిన ఉన్మాద చర్యలతో యావత్ ప్రజలు, హిందూ సమాజం ఆవేశంతో రగిలిపోతోంది. ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ పైన ప్రతీకార చర్యలు తీసుకుంటారా? అని ఆలోచిస్తున్నారు.
కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఒక దేశంతో యుద్దం చేయాలంటే అనేక పర్యవసానాలు ఎదురవుతాయి. అన్నీ బేరీజు వేసుకున్న తరువాతే ఈ విషయంలో ముందుకు వెళ్లాలి. ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ అదే పనిలో ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం. యావత్ దేశ ప్రజలంతా సగర్వంగా గల్లా ఎగిరేసుకునేలా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. అంతేకాదు, ఉగ్రవాదంపై పోరు విషయంలో మోదీ తెగువ, పట్టుదల, పోరాట పటిమను కూడా యావత్ ప్రపంచానికి తెలిసిరాబోతోంది.
దేశంలోకి ఉగ్రవాదులు చొరబడి బాంబు పేలుళ్లు, కాల్పులకు పాల్పడుతున్నారనే ఇక్కడున్న కొంత మంది సహకారం ఉంటేనే సాధ్యమైతుంది. లుంబినీ పార్క్, దిల్ సుఖ్ నగర్, గోకుల్ చాట్ బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు పాల్పడ్డారంటే ఇక్కడున్న కొందరు సహకరించడంవల్లే జరిగింది. జగిత్యాల, కోరుట్ల పీఎఫ్ఐకి అడ్డాగా మారాయి.
బహిరంగంగా పీఎఫ్ఐ కార్డులుతో ర్యాలీలు నిర్వహించినా కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు కనీసం కేసులు కూడా పెట్టలేదు. ఈ తరుణంలో జరగబోయే హిందూ ఏక్తా యాత్ర సందర్భంగా హిందువులంతా హాజరై ఐక్యతను ప్రదర్శించి సత్తాను చాటాల్సిన సమయం ఆసన్నమైంది.
ఉగ్రవాదుల, దేశద్రోహుల వెన్నులో వణుకుపుట్టేలా కరీంనగర్ లో ఈనెల 22న కనీవినీ ఎరగని రీతిలో హిందూ ఏక్తా యాత్రను నిర్వహించబోతున్నాం. ఒక్క కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే లక్ష మందికి తక్కువ కాకుండా హిందువులంతా హాజరవుతారని అంచనా వేస్తున్నాం. హిందువులంతా ఈ యాత్రకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్ ల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రతి ఒక్కరూ ఈ యాత్రకు తరలివచ్చేలా చూడాలని కోరుతున్నా.
జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో హిందువులంతా ఏకమయ్యారని, దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లలో వణుకు మొదలైంది. ఈనెల 22న కరీంనగర్ లో నిర్వహించబోయే ఏక్తా యాత్రతో తెలంగాణ వ్యాప్తంగా హిందువులంతా ఏకమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ది చెప్పడం ఖాయం.