న్యూఢిల్లీ, డిసెంబర్ 9: వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పార్లమెంట్లోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి లేవెనెత్తిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువచ్చి వాటి సత్వర పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా ఆయనను కోరారు.