మీరు గెలిచి రాయలసీమ లాభం ఏంటి?

– ఈ నెల 19 న జరిగే రాయలసీమ రణ భేరి కార్యక్రమానికి సంబంధించిన ప్రచార రధాలను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి

జగన్ 33 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. వైసీపీ చేసిన మోసాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి ఈ నెల 19 న కడప లో రాయలసీమ రణ భేరి కార్యక్రమం.
దాదాపు 25 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం .రాష్ట్రంలో మహిళలకు, ఉద్యోగుల కు, యువతకు ,రైతులకు తీరని మోసం ఈ ప్రభుత్వం చేసింది.కడప గడప నుంచి వైసిపి మోసాలను ఎండగట్టడానికి ఈ నెల 19 న రాయలసీమ రణ భేరి.రాయలసీమ లో 52 అసెంబ్లీ స్థానాల్లో 49 మంది వైసిపి అభ్యర్థులను గెలిపించారు.

8 మంది ఎంపీ లు వైసీపీ నుంచి గెలిచారు.మీరు గెలిచి రాయలసీమ లాభం ఏంటి? రాయలసీమ పురిటి గడ్డపై పుట్టిన జగన్ రాయలసీమ కు ద్రోహం చేశారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్ ఇదే చివరి అవకాశం కూడా అవుతుంది.2024 లో బిజెపి జనసేన కలిసి అధికారంలోకి రావడానికి సీఎం సొంత జిల్లా నుంచి శంఖారావం పూరిస్తున్నాం.

Leave a Reply