సి.పీ.ఎస్ వారం రోజులలో పూర్తి చేద్దామన్న అసమర్థ ముఖ్యమంత్రి ఎక్కడ?

– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
నందిగామ పట్టణం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట గురువారం ఉదయం ఉద్యోగ సంఘాల జేఏసీ వారు పెండింగ్ 7 డిఎలు, ప్రావిడెంట్ ఫండ్ 1650 కోట్ల రూపాయలు చెల్లించాలని, పే ఫిక్సేషన్ రేట్ 50% ఇవ్వాలని, ఎపిజిఎలై ఏడాదిన్నర బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే చెల్లించాలని చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య వారి దీక్షకు మద్దతు తెలియజేసి మాట్లాడడం జరిగినది.
ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగస్తుల ప్రావిడెంట్ ఫండ్ 1650 కోట్ల రూపాయలు ఎక్కడ?పీఆర్సీ ఫిట్మెంట్ రేటును 50% వెంటనే చెల్లించాలిఇప్పటివరకు బకాయి 7 డిఎలను ప్రభుత్వ ఉద్యోగస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదు?
ఎపిజిఎల్ఐ నిధులను ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదు? 7 రోజులలో సి.పి.ఎస్ విధానాన్ని పూర్తి చేద్దామని దొంగ ప్రకటనలతో అధికారంలోకి వచ్చి 30 మాసాలు పూర్తయిన సి.పి.ఎస్ స్కీం పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరుమెదపడం లేదు?
ఇది కాదా మాట తప్పటం మడమ తిప్పడం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ? తాడేపల్లి రాజాప్రసాదాలను వీడి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై జగన్మోహన్రెడ్డి తన వైఖరి ఏమిటో తెలియజేయాలి.పెండింగ్ 7 డిఎలు, ప్రావిడెంట్ ఫండ్ 1650 కోట్ల రూపాయలు చెల్లించాలి, పే ఫిక్సేషన్ రేట్ 50% ఇవ్వాలి, ఎపిజిఎలై ఏడాదిన్నర బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే చెల్లించాలి.

Leave a Reply