డిజిపి ఆఫీసుపై దాడి జరిగితే డిజిపి కూడా సంయమనం పాటిస్తారా?

– నా టెంపర్ లూజ్ అయితే మీరు తట్టుకోలేరు
– సీఎం,డిజిపి బాధ్యత వహించాలి
– ఏపీ వ్యాప్తంగా రేపు బంద్
– మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు కామెంట్స్:
40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి ఘటనలు చూడలేదు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం రాష్ట్రంలో నడుస్తోంది.ఏపీలో ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై దాడులు చేస్తున్నారు. పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం దేనికి సంకేతం.ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుంది. దాడులకు పోలీసులు ముఖ్యమంత్రి బాద్యులు. సీఎం,డిజిపి బాధ్యత వహించాలి. టీడీపీ కార్యాలయాలను దేవాలయంగా భావిస్తారు. రాజకీయ


పార్టీలు ప్రజాస్వామ్య పోరాటాలకు నిలువుటద్దం లాంటివి.100 గజాల దూరంలో డిజిపి ఆఫీసు ఉండి కూడా ఏమి చేయలేక పోయారు. నేను డిజిపికి ఫోన్ చేస్తే స్పందించలేదు. ఆర్గనైజ్డ్ గా దాడులకు పాల్పడుతున్నారు. మీరు లాలూచీ పడే దాడి చేయించారు. డిజిపికి,సీఎంకు తెలియకుండా జరిగిన దాడి కాదు. డ్రగ్ మాఫియాగా రాష్ట్రం మారింది. ఎపి నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి తరులుతుందని చెప్పడం కూడా తప్పా. మహారాష్ట్ర,తెలంగాణ, తమిళనాడుకు ఇక్కడ నుంచే గంజాయి తరులుతుంది.
ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించడం కూడా తప్పా. ఏపీ వ్యాప్తంగా రేపు బంద్ కు చంద్రబాబు పిలుపు.పార్టీ కార్యాలయంపై దాడి చేసి ప్రతిపక్ష నేతలను చంపాలని చూస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల ఇళ్లపై కూడా దాడులు చేశారు.ఎంత మందిని చంపుతారు? మనుషులు ప్రాణాలు పోతుంటే సంయమనం

పాటించాలని డిజిపి స్టేట్మెంట్స్ ఇస్తారా ? డిజిపి ఆఫీసుపై దాడి జరిగితే డిజిపి కూడా సంయమనం పట్టిస్తారా?తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే దాడి జరిగింది. రెండోసారి పట్టాభి ఇంటిపై దాడి చేశారు. సెక్యూరిటీ ఇవ్వాలని కోరిన ఇప్పటి వరకు ఇవ్వలేదు. అరాచకాలు చేస్తూ బయపెట్టాలని చూస్తున్నారు. అప్రజాస్వామిక చర్యలు వద్దని చెప్పడమే మేము చేసిన తప్పా? డ్రగ్ మాఫియాతో దాడులు చేయిస్తారా కార్యకర్తలకు నేను భరోసా ఇస్తున్నా ఎవ్వరు భయపడొద్దు. స్టేట్ టెర్రరిజంపై పోరాటం మేము చేస్తాం. కర్రలు, రాళ్లు, సుత్తులు,బీర్ బాటిళ్లతో దాడి చేస్తారా? తాగుబోతులను తీసుకొచ్చి దాడి చేయిస్తే నేను భయపడను. వైసీపీ నేతలను వదిలిపెట్టను. ప్రజల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రాగానే ఇటువంటి దాడులు చేస్తున్నారు. హౌస్ అరెస్టులు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు?
రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు అందరూ కలిసి రావాలని కోరుతున్నా. మా వాళ్ళు బూతులు తిట్టినా వారించా.నేను ఎప్పుడు ఎవరిని బూతులు తిట్టలేదు. నన్ను, మా పార్టీ నేతలను ఎన్నిసార్లు బూతులు తిట్టారు? నన్ను ఎన్నిసార్లు తిట్టారు ఎలా తిట్టారో మీకు తెలీదా?అనరాని మాటలు అన్నారు. నా టెంపర్ లూజ్ అయితే మీరు తట్టుకోలేరు. పరిధి దాటి మాట్లాడింది వైసీపీ నేతలే. చెప్పలేని చెప్పుకోలేని విధంగా భూతులు తిట్టారు. వైసీపీ నేతలు పరిది దాటి మాట్లాడలేదా?
బాధితులను పరామర్శించిన బాబు

కాగా వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన పార్టీ ఆఫీసు సిబ్బందిని చంద్రబాబునాయుడు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. దాడిపై ఆరా తీశారు. దుండగులు డీజీపీ ఆఫీసు ముందు నుంచే వచ్చారని, అక్కడ ఎస్‌ఐకూడా ఉన్నారని వారు చంద్రబాబుకు చెప్పారు.

Leave a Reply