వైసీపీ నేతలు డీఎన్ ఏ పరీక్షలు చేయించుకోవాలి

– రోజా సిగ్గులేకుండా మాట్లాడుతోంది
-మీరు బూతులు మాట్లాడితే మేము ప్రవచనాలు చెబుతామనుకున్నారా?
మాజీ మంత్రి పీతల సుజాత
నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, వైసీపీ నేతలు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. అసెంబ్లీని కౌరవసభగా మార్చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. తెలుగు జాతి గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన అన్న ఎన్టీఆర్ కుమార్తె , దేశం గర్వించదగిన నేత చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరమ్మను వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడటం సిగ్గుమాలిన చర్య.
బాబాయ్ హత్య విషయాలు , ప్రజా వ్యతిరేక విధానాలు చర్చకు వస్తాయనే భయంతోనే ముఖ్యమంత్రి ఇలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల కుటుంబాన్ని హేళన చేస్తూ మాట్లాడటం హేయం. సీతను అవమానించి రావణాసురుడికి ఏ గతి పట్టిందో, ద్రౌపతిని అవమానించి దుర్యోదనుడికి ఏ గతి పట్టిందో అదే గతి వైసీపీ ప్రభుత్వానికి పట్టబోతోంది. అసెంబ్లీలో వైసీపీ మహిళా నేతలు దిశా గురించి, ముఖ్యమంత్రి గురించి గొప్పలు చెప్పారు.
సాటి మహిళ భువనేశ్వరమ్మపై అన్ని నిందలు వేస్తే మహిళా ప్రతినిధులు ఎందుకు ఖండించలేదు? మీ కుటుంబంలోని వారి గురించి ఇలాగే మాట్లాడితే మీకెలా ఉంటుంది? వైసీపీ నేతలు డీఎన్ ఏ పరీక్షలు చేయించుకోవాలి. అధికారం ఉందని పదవుల కోసం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ నీచపు మాటలు మహిళలు భరించేస్థితిలో లేరు.
వైసీపీ ఎమ్మెల్యే రోజా సిగ్గులేకుండా మాట్లాడుతోంది. టీడీపీలో పనిచేసిన నీకు భువనేశ్వరి గారి గురించి తెలీదా? ఆవిడను దూషిస్తుంటే నువ్వు ఎలా చూస్తూ ఉన్నావ్?
ఆరోజు మంత్రిగా ఉన్న నన్నూ అవమానించావ్. రోజా వ్యాఖ్యలను బట్టి పగడ్బందీ వ్యూహంతోనే భువనేశ్వరమ్మ గారిపై నిందలు వేసినట్టు అర్ధమవుతోంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎంత దారుణంగా ఉన్నాయో అందరూ విన్నారుగా. ఏ ఆడబిడ్డ అయినా ఇలా మాట్లాడితే భరించగలరా? మీ రాజకీయ లబ్ధి కోసం ఒక మహిళపై ఇలా నిందలు వేస్తారా? బాబాయ్ హత్యను పక్కదారి పట్టించేందుకు ఇంతలా బరితెగిస్తారా? కరోనా సమయంలోనూ భువనేశ్వరమ్మ ఎంతో సేవ చేశారు.
గౌరవ సభలో తన ఆవేదనను ఏమాత్రం బయటపడకుండా హుందాగా చంద్రబాబు కంట్రోల్ చేసుకున్నారు. చంద్రబాబు కంట తడి పెడితే ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. వైసీపీ నేతల మాటలు, చేష్టలు దుర్మార్గంగా ఉన్నాయి. మీరు బూతులు మాట్లాడితే మేము ప్రవచనాలు చెబుతామనుకున్నారా?మాకూ వచ్చు బూతులు. మా నాయకుడు ఆదేశించిన రోజున మేము అడిగే ప్రశ్నలకు మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా?
సింహం ఒక అడుగు వెనకడుగు వేస్తే రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతుందని మర్చిపోకండి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు, టీడీపీ సైన్యం చంద్రబాబు గారి వెంట ఉన్నారు.భువనేశ్వరమ్మ గారి ఉసురు వైసీపీ ప్రభుత్వానికి తగులుతుంది.

Leave a Reply