– అందరూ అప్రమత్తంగా ఉండాలి
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్
మంగళగిరి: మంత్రి నారా లోకేష్ కు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కోటి సభ్యత్వం ఘనత లోకేష్ బాబుదేనని ప్రశంసించారు. కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ యత్నిస్తున్న దుష్ప్రచారానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఇంకా, పల్లా శ్రీనివాసరావు ఏమన్నారంటే.. సంక్షేమం, అభివృద్ధి, సేవకు లోకేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ కాబోతున్నారు. కార్యకర్తల సంక్షేమంతో పాటు మంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఆయన నిరంతరం చేస్తున్నారు. అటు అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంతో, ఇటు యువ నాయకత్వం లోకేష్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. అందుకే పెద్ద ఎత్తున యువత లోకేష్ బాబు ఉన్నత ఆలోచనలకు ఆకర్షితులపై టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు.
యువగళం పాదయాత్ర చేపట్టి రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకొని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు నారా లోకేష్ పట్టువదలని విక్రమార్కుడిలా కృషి చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లపాటు అంధకారంలో ఉన్న ఏపీలో వెలుగులు నింపేందుకు పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు యువనేత చేస్తున్న కృషి ప్రశంసనీయం. గూగుల్, టీసీఎస్ తో పాటు అనేక కంపెనీలు నేడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయంటే అది లోకేష్ బాబు కృషివలనే.
గత పాలనలో ఏపీవైపు పెట్టుబడిదారులు చూడాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఎలా అని పెట్టుబడిదారులు భయపడుతున్నారంటే ఎంత విధ్వంసకర పాలన సాగిందో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. కమీషన్ లు ఇవ్వకుంటే రాష్ట్రంలో ఉన్న కంపెనీలను తరిమికొట్టారు. ఏపీకి ఉన్న బ్రాండ్ ను పాతాళంలోకి నెట్టారు. చలికి భయపడిన అసమర్థులు గత పాలకులు. కనీసం దావోస్ వెళ్లి పెట్టుబడులు తీసుకు వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు.
టీడీపీ పార్టీ కుటుంబ సభ్యుల అండతో ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంలో తండ్రికి తగిన తనయుడిగా నారా లోకేష్ ముందున్నారు. లోకేష్ బాబుకు ఉన్న అపారమైన తెలివితేటలతో 15 సెకండ్లకే ఒక మెంబర్ షిప్ చేయగలిగాం. 2 నెలల్లోనే కోటికి పైగా సభ్యత్వం పూర్తి చేశామంటే లోకేష్ బాబు సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవాలి. నాడు స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని కార్మికులు ప్రాధేయపడగా.. నాడే లోకేష్ బాబు అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు.
ఆ రోజు చెప్పిన మాటకు కట్టుబడినట్లే నేడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయత్వంలో కేంద్రం నుండి స్టీల్ ప్లాంట్ కు రూ. 11,440 కోట్లు తీసుకు వచ్చారు. దీంట్లో లోకేష్ బాబు పాత్ర చాలా కీలకం. ప్యాకేజ్ తో పాటు ప్లాంట్ ను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. గత పాలకులు ప్లాంట్ లో నష్టాలను చూపించి దాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రపన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టాక కొనఊపిరితో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ కేటాయింపజేసి, ప్రాణం పోశారు. స్టీల్ ప్లాంట్ కు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది.
వైసీపీ నాయకులు పార్టీల మధ్య విభేదాలను సృష్టించి కూటమికి నష్టం చేయాలని చూస్తున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. కలిసిమెలిసి నడవాలి. సమన్వయంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరో ఏదో మాట్లాడితే తొందరపడవద్దు. కూటమి పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. యువతకు భవిష్యత్ ఉంటుంది.