– పొదలకూరులోని డీఎన్ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి కిట్ల పంపిణీ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
పొదలకూరు: విద్యారంగం కోసం ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చుపెడుతోంది. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి పిల్లలు బాగా చదువుకోవాలి. మూడు ఎకరాల్లో కష్టపడి పండిస్తే ఏడాదికి రూ.90 వేలు మాత్రమే మిగులుతుంది. అంటే నెలకు రూ.10 వేలు కూడా రాని పరిస్థితి. పట్టుదలగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే మంచి జీతాలతో జీవితంలో స్థిరపడవచ్చు.
అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోండి. పిల్లలు బాగా చదువుకుని జీవితంలో స్థరపడితే తల్లిదండ్రులకు పండగే. ఈ విద్యాసంవత్సరంలో 10 వ తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి. డ్రాపవుట్స్ లో ఎక్కువగా గిరిజన, దళిత చిన్నారులు ఉండటం బాధాకరం.
బడి ఈడు కలిగిన ప్రతి బాలుడు, బాలిక స్కూలులో ఉండేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు సహచర పిల్లలు కూడా బాధ్యత తీసుకోవాలి.