Suryaa.co.in

Andhra Pradesh

అంబేద్కర్ స్మృతి వనంలో జరిగిన ఘటనను ఖండిస్తున్నాం

-మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్

విజయవాడ: విజయవాడ అంబేద్కర్ స్మృతి వనంలోని విగ్రహం ధ్వంసం ఘటనపై మాజీ మంత్రి, టీడీపీ నాయకులు డొక్కా మాణిక్యవరప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఈ ఘటనను ఖండిస్తూ, అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, ధ్వంసం చేయకూడదని అన్నారు.

ఈ ఘటన వెనుక అరాచక శక్తులు ఉన్నాయేమో అని అనుమానిస్తూ, ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, అంబేద్కర్ విగ్రహం కంటే జగన్ మోహన్ రెడ్డి పేరును హైలైట్ చేసే విధంగా శిలాఫలకం ఏర్పాటు చేసినట్లు ఆరోపించారు.

దళితుల కోసం భూములు పంచే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేస్తూ, విగ్రహం విధ్వంసం చేసిన శక్తులకు బుద్ది చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెరుగల మణికుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు బిక్కు నాయక్, జనసేన పార్టీ నాయకులు పాలకాయల వెంకట్ మరియు బట్టు సురేంద్ర పాల్గొన్నారు.

LEAVE A RESPONSE