Suryaa.co.in

Andhra Pradesh

ఉండిలో ప్రజాసహకారంతో పార్కు నిర్మాణం

– రఘురామరాజు పిలుపునకు స్పందించిన దాతలు
– అభినందించిన కలెక్టర్ నాగరాణి

ఉండిలో అబ్బాయిరాజు జన్మభూమి పార్కును స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుతో కలసి కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. దాతల విరాళాలతో సర్వాంగసుందరంగా, అన్ని హంగులు, సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ పార్కు.. ఉండి ప్రజల పట్టుదలకు- సామాజికసేవా దృక్పథానికి నిదర్శనమని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అభినందించారు.

ప్రజల్లో సామాజిక బాధ్యత-ప్రభుత్వానికి సహకరించాలన్న ఆలోచన పెరుగుతుందనడానికి ఈ పార్కు నిర్మాణమే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ పార్కు నిర్మాణం తనకు వ్యక్తిగతంగా సంతృప్తి లిగించిందని, ఇందుకు సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ముందుకొచ్చిన దాతలను ఆయన అభినందించారు.

ఆహ్లాదకరమైన వాతావరణంతో మానసిక సమస్యలు కూడా దూరమవుతాయని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఈ స్ఫూర్తితో ఉండి నియోజకవర్గంలో మొక్కల పెంపకాన్ని, ఒక ఉద్యమంగా చేపట్టాలని సూచించారు. పార్కు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును అభినందించి, ప్రజాప్రతినిధులు ఆయన ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE