Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ సెంట్రల్‌ ఆఫీసులో రసవత్తరంగా వేలం పాట

– రూ.27 వేలకు లంబోదరుడి లడ్డూ కైవసం

మంగళగిరి: వినాయక చవితి వేడుకల్లో ముఖ్యమైన ఘట్టం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో శనివారం చోటుచేసుకుంది. వినాయకుడి చల్లని చూపులు పడి.. ఎంతో మహిమాన్వితమైన లడ్డూను పొందేందుకు.. టీడీపీ నాయకులు, కార్యాలయ సిబ్బంది పోటీ పడ్డారు. వేలం పాటలో పోటాపోటీగా వేలం పాడుతూ.. విఘ్నేశ్వరుడి లడ్డూను కైవసం చేసుకోవాలని తీవ్రంగా యత్నించారు. రసవత్తరంగా సాగిన వేలంపాటలో కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ప్రోగ్రాం కమిటీ రూ. 27,000లకు లంబోదరుడి లడ్డూని కైవసం చేసుకుంది.

ఈ కార్యక్రమంలో ఏవీ రమణ, ధారపనేని నరేంద్ర, రాంబాబు, హర్షా, ధామోదర్, సంపత్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేపు ఆదివారం వినాయక నిమజ్జన కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఏక దంతుడి ఆశీసులు పొందాలని, నాయకులు, కార్యాలయ సిబ్బంది కోరారు.

LEAVE A RESPONSE