– బీసీ ల మీద సీఎం ది కపట ప్రేమ
– మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: దేశం మొత్తం ఓబీసీ వర్గాల వెనకబాటు తనం పై చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా కులగణనకు ఒప్పుకుంది.
చట్ట సభల్లో కూడా బీసీ లకు రిజర్వేషన్లు వస్తాయనే వాతావరణం ఏర్పడింది.
చట్టసభల్లో రిజర్వేషన్లు దేవుడెరుగు ఇపుడు రాష్ట్రం లో స్థానిక ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు రావడం గగన మవుతోంది. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ కు మోక్షం లభించలేదు ..ఢిల్లీ లో రాష్ట్ర పతి దగ్గర బుక్ బిల్లులు ఏమయ్యాయో తెలియదు. ఢిల్లీ లో సీఎం నానా హంగామా చేశారు. ఈ రోజు కేబినెట్ సమావేశం ఉంది ఏం చేస్తారు ? బీసీల పట్ల కాంగ్రెస్ ,బీజేపీ లది వగల ప్రేమే అని తేలిపోయింది.
బీసీ ఓట్ల కోసమే ఆ రెండు పార్టీలు డ్రామా ఆడుతున్నాయి. తొమ్మిదో షెడ్యూల్లో పెడితే తప్ప బీసీ లకు రిజర్వేషన్లు పెరుగవు. బిజెపి ముస్లిం రిజర్వేషన్ల ను సాకుగా చూపి బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటోంది.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం లకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదా ?
ews రిజర్వేషన్ల లో ముస్లిం లు లేరా ?
రిజర్వేషన్లు రాష్ట్రం పరిధిలో లేని అంశమనీ ..ఎవరైనా ఇక్కడ పెంచితే జైలుకు వెళ్లడం ఖాయమని రేవంత్ రెడ్డి ప్రతిపక్షం లో ఉండగా చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదని తెలిసి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల పెంపు ఆర్డినెన్స్ ను గవర్నర్ దగ్గరకు ఎందుకు ఆపారు ?
బీసీ బిల్లుల ఆమోదానికి కేంద్రం దగ్గర రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.
బీసీ ల మీద సీఎం ది కపట ప్రేమ. కాంగ్రెస్ బీసీ నాయకులు 42 శాతం రిజర్వేషన్ల పెంపు కోసం గట్టిగా కృషి చేయాలి. బీసీలకు ఏదీ చేయాలన్నా బీ ఆర్ ఎస్ దే సాధ్యం. సీఎం మంత్రులు బీసీ బిల్లులు ఆమోదించుకోవడానికి ఢిల్లీ వెళ్లి పాస్ అయ్యాకే హైదరాబాద్ తిరిగి రావాలి
కాంగ్రెస్ ,బీజేపీ ల చేతిలో మరోసారి మోస పోవడానికి బీసీ లు సిద్ధంగా లేరు
ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గరకు పంపగానే కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు .ఇపుడు ఏం సమాధానం చెబుతారు?
బీసీ లకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు కోసం ఎందుకు ఆర్డినెన్స్ తేలేదు ? ఢిల్లీకి అఖిల పక్షం తీసుకెళితే మేము వస్తాం .ఆ పని చేయడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు: మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
బీసీలకు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో బీసీ లకు చేయాల్సినవి కూడా చేయడం లేదు
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు ఒక సారి జీవో అని మరో సారి బిల్లు ని కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది
కాంగ్రెస్ మానిఫెస్టో లో పెట్టినట్టు బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి.
బీసీ లకు కాంగ్రెస్ ఈ సారి మోసం చేయాలని చూస్తే వదిలి పెట్టే ప్రసక్తే లేదు. బీసీ సంఘాలతో కలిసి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతాo
ప్రెస్ మీట్ లో బాలరాజు యాదవ్ ,కె .కిషోర్ గౌడ్ ,శుభప్రద్ పటేల్ ,గౌతం ప్రసాద్ పాల్గొన్నారు.