టిడ్కో ఇళ్లు బ్యాంకుల్లో తాకట్టుపెట్టి తీసుకున్న 10వేల కోట్లు ఎవరిజేబుల్లోకి వెళ్లాయి జగన్ రెడ్డి?
• సెంటు పట్టాల్లో అవినీతి.. జగనన్న ఊళ్ల నిర్మాణం పేరుతో జరిగే ఇళ్లల్లో అవినీతి
• పేదలకు సెంటు పట్టా జాగాలిచ్చే నెపంతో రూ.7వేలకోట్లు కొట్టేసిన జగన్ రెడ్డి.. తాజాగా చంద్రబాబు పేదలకోసం నిర్మించిన టిడ్కోఇళ్లను, లబ్ధిదారులకే తెలియకుండా బ్యాంకుల్లో తాకట్టుపెట్టి రూ.10వేలకోట్ల రుణం తెచ్చాడు
• జగన్ రెడ్డి నిర్వాకంతో బ్యాంకులు తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ టిడ్కోఇళ్ల లబ్ధిదారులపై పడ్డాయి
• జగనన్న కాలనీల నిర్మాణం ముసుగులో జరిగిన భారీ అవినీతిపై తక్షణమే విచారణ జరపాలి
• బ్యాంకులు ఎన్.పీ.ఏ లో పెట్టిన లబ్ధిదారులందరినీ రాష్ట్ర ప్రభుత్వమే రెగ్యులర్ స్టేటస్ లో పెట్టేలా చూడాలి
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు శాశ్వతంగా ఒక ఆస్తిని ఇవ్వాలనే సదుద్దేశంతో వారి సొంతింటికలను చంద్రబాబునాయుడు నిజం చేస్తే, జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండి వారి కలల్ని కలలుగానే ఉంచాడని, టీడీపీ హయాంలో షీర్ వాల్ టెక్నాలజీతో పేదలకోసం నిర్మించిన 3.13లక్షల ఇళ్లను, జగన్ రెడ్డి బ్యాంకుల్లో తనఖాపెట్టి అప్పులు తీసుకోవడం, అతని సిగ్గుమాలిన తనానికి నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
పేదలకే తెలియకుండా 10వేలకోట్ల రుణం తెచ్చిన జగన్ రెడ్డి నిర్వాకంతో బ్యాంకులు లబ్ధిదారులపై పడ్డాయి. చాలా చోట్ల లబ్ధిదారుల్ని ఎన్.పీ.ఏ జాబితాలో చేర్చాయి
“2014-19 మధ్యన టీడీపీప్రభుత్వం నిర్మించిన ఇళ్లు దాదాపు 90శాతం వరకు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల మొత్తం నిర్మాణమే పూర్తయింది. అధికారంలోకి వచ్చాక ఆ ఇళ్లకు తనపార్టీ రంగులేసి తానేకట్టించినట్టుగా ప్రచారం చేసుకున్నాడు జగన్ రెడ్డి. చంద్రబాబు పేదలకోసం నిర్మించిన టిడ్కోఇళ్లను వారికి కేటాయించకుండా.. 30లక్షల ఇళ్లపట్టాలు పేదలకు పంచుతున్నట్టు నాటకాలడిన జగన్ రెడ్డి అతని ప్రభుత్వం రూ. 7వేలకోట్లు కొట్టేసింది. చాలీ చాలని ఇంటి జాగాలు.. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో పేదలకు ఇచ్చి.. వారిన ఉద్ధరించినట్టు జగన్ అతని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది.
టీడీపీప్రభుత్వం గతంలో పేదలకోసం కట్టించిన ఇళ్లను వారికి ఇవ్వని జగన్ రెడ్డి.. ఆ ఇళ్లను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి… లబ్ధిదారులకే తెలియకుండా రూ.10వేలకోట్ల రుణం తీసుకొచ్చాడు. రుణం పొందడంకోసం లబ్ధిదారులకు ఇళ్లు ఇస్తున్నామని.. వాటికి సంబంధించిన కొద్దీగొప్పాపనులు పూర్తిచేయాల్సి ఉందని బ్యాంకులకు చెప్పి జగన్ ప్రభుత్వం రుణాలు పొందింది. అలా తీసుకున్న రుణాలకు ఈ ప్రభుత్వం రెండేళ్ల కాలప రిమితి అడిగింది. రెండేళ్లు అయినా బ్యాంకుల్లో అప్పు తీసుకున్న జగన్ రెడ్డి ప్రభు త్వం ఇళ్ల నిర్మాణం పూర్తిచేయలేదు.
దాంతో బ్యాంకులు నేరుగా లబ్ధిదారులకే నోటీసు లు పంపాయి. అంతటితో ఆగకుండా చివరకు ఇళ్ల లబ్ధిదారులకు మరే బ్యాంకులో రుణం పుట్టకుండా వారిని ఎన్.పీ.ఏ (నాన్ పెర్ఫ్మారెన్స్ అకౌంట్స్) జాబితాలో చేర్చా యి. బ్యాంకుల నుంచి ఒత్తిడి రావడం..ఇళ్లు వేలం వేస్తామని చెప్పడంతో రాష్ట్రవ్యాప్తం గా ఇళ్లు లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. బ్యాంకులు ఎన్..పీ.ఏలుగా ప్రకటించిన పేదల్ని తిరిగి రెగ్యులర్ స్టేటస్ లో పెట్టేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోజరుగుతున్న జగనన్న కాలనీల నిర్మాణంపై తక్షణమే విచారణ జరిపించాలని, టీడీపీప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిపోయిన టిడ్కోఇళ్లను వెంటనే పూర్తి చేసి వెంటనే అర్హులకు కేటాయించాలని జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం.
వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ పేరుతో 15, 20 ఏళ్లక్రితం పేదలకు ప్రభుత్వాలిచ్చిన ఇళ్ల లబ్ధిదారుల నుంచి కూడా జగన్ డబ్బులు గుంజాడు
టీడీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చి ఉంటే.. పేదలకోసం గతంలో నిర్మించిన 3.13లక్షల ఇళ్లకు తోడు రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేది. నేడు బ్యాంకులవారు పేదలపై పడి తీసుకున్న రుణం చెల్లించాలని అడిగే పరిస్థితి కూడా ఉండేది కాదు. గతంలో టీడీపీప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్లతో పాటు…అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు 15, 20 ఏళ్లక్రితం పేదలకు ఇచ్చిన ఇళ్లపై కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ కింద ప్రజలనుంచి డబ్బులు వసూలు చేసింది .
అదో రకమైన దోపిడీ. ఆ దోపిడీపై ప్రతిపక్షాలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సెంటుపట్టాల పేరుతో పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చి ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నట్టు జగన్ ప్రభుత్వం డబ్బాలు కొట్టుకుంది. చివరకు నాలుగేళ్ల 8నెలల పాలనలో జగన్ రెడ్డి..అతని చేతగాని ప్రభుత్వం సాధించి ఘనత ఏమిటయ్యా అంటే పేదల ఇళ్లను వారికే తెలియకుండా తాకట్టు పెట్టి బ్యాంకుల్లో రుణాలు పొందడం.
ప్రజల్ని మోసగిస్తూ…రాష్ట్రాన్ని లూఠీ చేస్తున్న జగన్ రెడ్డి సిగ్గులేకుండా ఏపీ నీడ్స్ జగన్ అని ప్రచారం చేసుకుంటున్నాడు
ప్రజలకే తెలియకుండా వారిని మోసగిస్తూ… రాష్ట్రాన్ని లూఠీ చేసిన జగన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావడానికి ప్రభుత్వసొమ్ముతో వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమానికి శ్రీకారంచుట్టాడు. జగన్ అతని ప్రభుత్వం ఏపీ నీడ్స్ జగన్ అంటుంటే.. ప్రజలంతా ముక్తకంఠంతో ఏపీ హేట్స్ జగన్ అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని మరలా రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలో చెప్పాలని ప్రజలే నిలదీస్తున్నారు. జగన్ రెడ్డి అతని ప్రభుత్వం మాఫియాగా ఏర్పడి తమను దోచుకుందనే వాస్తవాన్ని.. నాలుగున్నరేళ్లలో అంతులేని అవినీతి జరిగిందనే నిజాన్ని ప్రజలు గ్రహించారు. ఎంతత్వరగా ఈప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామా అని ఏపీ ప్రజానీకం ఎదురు చూస్తోంది.
బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.10వేలకోట్లు ఎవరిజేబుల్లోకి వెళ్లాయి జగన్ రెడ్డి?
టిడ్కోఇళ్ల లబ్ధిదారులకు తెలియకుండా ఇళ్లు తాకట్టుపెట్టి తీసుకొచ్చిన రూ.10వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ముఖ్యమంత్రి చెప్పాలి. జగనన్న కాలనీల ముసుగు లో పేదలకు కేటాయించిన సెంటుపట్టాలు… తూతూమంత్రంగా జరుగుతున్నఇళ్ల నిర్మా ణం అంతా ఈ ప్రభుత్వ అవినీతిలో భాగంగా జరిగిందే. గత ప్రభుత్వం పేదలకోసం నిర్మించిన ఇళ్లకు నేడు బ్యాంకు అధికారులు నోటిసులివ్వడం కూడా జగన్ రెడ్డి అవినీ తిలో భాగమనే చెప్పాలి. ఇళ్ల నిర్మాణం విషయంలోనే కాదు.. అనేక పథకాలతో ఏ ప్రభుత్వం ఏ నాయకుడు తమకు మంచిచేశాడో…తమ బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచించాడో ప్రజలు గ్రహించాలి.” అని బొండా ఉమా విజ్ఞప్తి చేశారు.