Suryaa.co.in

Andhra Pradesh

తెదేపా మహానాడు నిర్వహణకు 16 కమిటీలు

తెదేపా మహానాడు నిర్వహణకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు 16 కమిటీలను నియమించారు.పలువురు సీనియర్ నాయకులను కమిటీల్లో సభ్యులుగా నియమించారు.

రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి ఉన్న స్థలంలో ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించనున్నారు.మహానాడు వేదిక వద్ద శుక్రవారం భూమిపూజ నిర్వహించి, పనులు ప్రారంభిస్తారు.

ఆహ్వాన కమిటీలో తెదేపా ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సభ్యులుగా ఉన్నారు. తీర్మానాల కమిటీలో యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్.ఏ.షరీఫ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి వంటి సీనియర్ నాయకుల్ని నియమించారు.అన్ని కమిటీల్లో కలిపి మొత్తం 200 మంది ఉన్నారు.

LEAVE A RESPONSE