Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుకు ఆపద రావడంతో భువనేశ్వరి బయటికొచ్చారు

– మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

మృగరాజైన సింహానికి ఆపద రావడంతో సివంగి బయటికొచ్చినట్లు చంద్రబాబుకు ఆపద రావడంతో భువనేశ్వరి బయటికొచ్చారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ…ఏనాడు బయటికి వచ్చి రాజకీయాల్లో తలదూర్చని భువనేశ్వరి గారు బయటికొచ్చి ‘నిజం గెలవాలి’ అని యాత్ర చేస్తుంటే కొడాలి నాని అవాకులు చవాకులు పేలుస్తు్నారు.

మొదటిసారి కొడాలి నాని వాస్తవాలు మాట్లాడాడు. జగన్ గురించి నిజాలు బయట పెట్టాడు. దీన్ని బట్టి మంత్రి పోయిందని జగన్ పై కొడాలి నానీకి అక్కసు ఉన్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు పనికిరాని వాడు అని కొడాలి నాని నోటి వెంట వచ్చింది. ఇది వాస్తవం అని అందరూ అనుకుంటున్నారు. కాకపోతే కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి పేరుకు బదులు వేరే పేరు ఉచ్చరించాడు. కొడాలి నాని మాట్లాడిన మాటలను మేము స్వాగతిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కి 15 సీట్లు కూడా రావని తేలిపోయింది. అందుకే జగన్మోహన్ రెడ్డికి దమ్ము, ధైర్యం కోల్పోయాడు.

73 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నాయుడు సింహం. అడవిని కాపాడటానికి మృగరాజు ఎలా ఉంటాడో రాష్ట్రాన్ని కాపాడటానికి చంద్రబాబు నాయుడు అలా ఉన్నారు. శేషాచల అడవుల్లోని గంధపు చెక్కల స్మగ్లర్లు అందరూ జగన్ అనుచర గణమే. అడవిని కాపాడటానికి మృగరాజు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అనుచర గణం సంగతి చూడాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలి. సింహం ఉంటే అడవిలో ఎవరు దూరరు. అలాగే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉంటే జగన్ లాంటి క్రూరులు భయపడతారు. తన ఆటలు సాగవు అని జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నాడు. తను ఓడిపోతున్నట్లు గ్రహించాడు.

పిరికిపంద జగన్ ఎలాంటి సాక్షధారాలు లేకుండా అవినీతి మరక అంటించి చంద్రబాబు నాయుడును జైల్లో వేయించారు. భువనేశ్వరి గారు ఒక శివంగిలాగా మారారు. సింహాన్ని బంధిస్తే శివంగిలాగా భువనేశ్వరి గారు ముందుకు వచ్చారు. దీంతో వైసీపీ నాయకులకు వెన్నులో వణుకు పుట్టింది. అందుకే భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గార్ల మీద అవాకులు చవాకులు పేలుస్తున్నారు. ఎన్టీ రామారావు నా దైవం అని మాట్లాడే కొడాలి నాని కి ఎన్టీఆర్ కుమార్తె గురించి మాట్లాడే అర్హత లేదు.

ఎన్టీ రామారావు గారాలపట్టి ఎవరంటే . భువనేశ్వరి గారు. బయటికి రావటంతో కొడాలి నాని ఓర్చుకోలేకపోతున్నాడు. కొడాలి నానిని గుడివాడ ప్రజలు బట్టలూడదీసి కొడతారు. ఎన్టీఆర్ దేవుడు అయినప్పుడు ఎన్టీఆర్ కుమార్తె దేవత కాదా? మాకు చంద్రబాబు నాయుడు దేవుడు, నారా భువనేశ్వరి గారు దేవత. లోకేష్ గారిని దేవుడి కుమారుడని, బ్రహ్మణి గారిని దేవుడి కోడలు అని దేవాన్ష్ ని దేవుడి మనవడని మేము అనుకుంటాము. అలా కొడాలి నాని ఎందుకు అనుకోవడం లేదు. జగనాసురుడిని కొడాలి నాని మెప్పించి, మళ్లీ మంత్రి పదవి పొందాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణీలపై అవాకులు చవాకులు పేలడం మానాలి. కొడాలి నాని అతివాగుడుకు జనాలు ఛీ కొడుతున్నారు.

ఆఖరికి కొడాలి నాని భార్య పిల్లలు సైతం కొడాలి నానిని అసహ్యించుకుంటున్నారు. ఈ విషయం కొడాలి నాని తన మిత్రులను అడిగినా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు స్కామ్ చేశారని చెబుతున్నారు. ఏం స్కాం? ఎలా చేశారు.. వివరాలు సాక్షాధారాలతో చూపండి. కొడాలి నాని 1994లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. టిడిపి తరఫున పోటీ చేశాడు.

ఇలా అందరి సభ్యత్వాలు కలిపే రూ. 27 కోట్లు అయింది. అది స్కామ్ ఎలా అవుతుందో కొడాలి నాని చెప్పాలి. స్కాం వివరాలు తెలపండి అని అడిగితే తెలుగుదేశం పార్టీకి వచ్చిన సభ్యత్వ రుసుము గురించి చెబుతున్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు ని జైల్లో వేశారు. చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం రూ. 35 కోట్లు ఖర్చు పెట్టారట.. ఇలా అయితే 16 నెలలు జైల్లో ఉన్న జగన్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి 4 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉండాలి. అంత ఖర్చు పెట్టారా?

జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చి నాలుగున్నర సంవత్సరాలు పైబడింది. ఈ కేసులు కోర్టు పరిధిలోకి రాకుండా ఉండటానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? అది ఎవడబ్బ సొమ్ము? ఇసుక, మైనింగు, లిక్కర్ల ద్వారా కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. ఈ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి కేసులకు వినియోగించుకున్నారు. అటువంటివారు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటమా? ఎన్టీ రామారావు తో దిగిన ఒక ఫోటో నైనా కొడాలి నాని చూపించగలరా? ఈ జగనాసురుడిని ఓడించడానికి అందరం కంకణం కట్టుకొని ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వెల్లడిస్తారో ఆ మరుసటి రోజే ఈ రాష్ట్రానికి దీపావళి.

ఆరోజే చంద్రబాబు నాయుడును అభిమానించే వాళ్ళందరూ దీపావళి చేసుకుంటారు. నరకాసురుడి పీడ వదిలితే ఎలా పండుగ చేసుకుంటారో.. ఈ రాష్ట్రానికి జగనాసురుడి పీడ వదిలినప్పుడే నిజమైన దీపావళి. ఆరోజు మనమందరం కలిసి ఘనంగా దీపావళి జరుపుకుందాం. చంద్రబాబు నాయుడు కి రెండు ఎకరాల ఆస్తి నుంచి ఇన్ని ఆస్తులు, ఇంత డబ్బు ఎలా వచ్చింది అని వైసీపీ నాయకులు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇండియాలోనే ఒక గొప్ప స్టార్. ఎన్టీ రామారావు గారి కుమార్తెను వివాహం చేసుకొని ఆ తర్వాత హెరిటేజ్ ను స్థాపించారు.

వర్కర్లతో పాటు భువనేశ్వరి కూడా వర్కర్లు వేసుకునే డ్రెస్ తో పనిచేసేవారు. ఈరోజుటికి కూడా ఆ హెరిటేజ్ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. 30ఏళ్ల నుంచి అభివృద్ధి చెందింది. టాటా, బిర్లా, రిలయన్స్ వీరు కూడా కింది నుంచి పైకి వచ్చినవారే. జగన్మోహన్ రెడ్డి ఏ వ్యాపారం చేసి పైకి వచ్చాడో చెప్పాలి. 2004కు ముందు రాజశేఖరరెడ్డి నాలుగు లక్షలు, ఐదు లక్షలకు చెక్కులు రాసేవాడు. జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నడిపిస్తున్నాడు.

బీసీ కులస్తుడైన వెంకట నరసయ్య దగ్గర సున్నపు బట్టీలో రాజారెడ్డి కూలీగా పనిచేసిన విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి మరవకూడదు. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల అఫిడవిట్లో ఉన్న ఆస్తులు, ప్రస్తుతం జగన్ రెడ్డికి ఉన్న ఆస్తుల్లో చాలా వ్యత్యాసం ఉంది. వ్యాపారాలు చేస్తే డబ్బు వస్తుందనే కనీస జ్ఞానం జగన్ కు లేదు. కొడాలి నాని తన వాగుడును కట్టిపెట్టాలి. గుడివాడలో కొడాలి నాని ఓడిపోవడం ఖాయం. కొడాలి నాని కి గుడివాడ ప్రజలు బట్టలూడదీసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, కొడాలి నాని గ్రహించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిందిగా సూచిస్తున్నామని బుద్ధ వెంకన్న సూచించారు

LEAVE A RESPONSE