Suryaa.co.in

Andhra Pradesh

24 గంటలు, 365 రోజులు అవినీతి చేయడమే జగన్ రెడ్డి, వైసీపీ స్ట్రక్చర్

• ప్రజలసొమ్ముని వాలంటీర్లకు, ఐప్యాక్ కు దోచిపెట్టడమేనా వైసీపీ స్ట్రక్చర్?
• జగన్ రెడ్డికి, అతనిపార్టీకి ఉన్న అజెండా దోపిడీ చేయడమే
• వైసీపీలో దళిత, బీసీ ఎమ్మెల్యేలు ఎవరికైనా స్వేచ్ఛ ఉందా?
• గెలిచినప్పటినుంచీ ఎంతమంది బీసీ, దళిత ఎమ్మెల్యేలు నేరుగా జగన్ రెడ్డిని కలిసి తమ నియోజకవర్గ సమస్యలు చెప్పుకున్నారు?
• ముఖ్యమంత్రే దోచేస్తుంటే..మనం మాత్రం ఆగితే ఎలా అని ఓట్లేసిన ప్రజల్ని, గెలిపించిన నియోజకవర్గాల్ని కూడా విచ్చలవిడిగా దోచేశారు
• రాజకీయ ప్రయోజనాలకోసం సొంత బాబాయ్ ని చంపించినవాడు, ఇప్పుడు గెలుపు పేరుతో వైసీపీలోని దళిత, బీసీ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని బలిచేస్తున్నాడు
• గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుప్పం, పులివెందులలో టీడీపీ గెలిచినప్పుడే జగన్ రెడ్డికి తన భవిష్యత్ అర్థమైంది
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్ని బదిలీచేసినట్టు జగన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యే లు మంత్రుల్ని ట్రాన్స్ ఫర్ చేస్తున్నాడని, ఒక చోట పనికిరాని వారిని మరో చోట కి పంపుతుంటే, ప్రజలేమో ఎవరైనా ఒకటే కదా అంటున్నారని, తనపార్టీ ఎమ్మెల్యేలతో పాటు, తనపై కూడా ప్రజల్లో అదే దురభిప్రాయం ఉందనే వాస్తవాన్ని జగన్ రెడ్డి గ్రహించాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సూచించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“ ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రస్తుతం మంత్రిగా ఉన్న వ్యక్తిని మరో నియోజకవర్గానికి జగన్ బదిలీ చేశాడంటే, తన సర్వేల్లో అతను గెలుపుకు పనికిరాడని ముఖ్యమం త్రి ఒప్పుకున్నట్టేగా! ఇప్పటివరకు ఓట్లేసిన పాపానికి వైసీపీ ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాల ప్రజలు భరించారు. ఇకపై వారిని, వారి అఘాయిత్యాలు దోపిడీని ఇతర నియోజకవర్గాల వారు కూడా భరించాలి. ప్రధాన ప్రతిపక్షంగా తాము కొన్ని సద్విమర్శలు చేస్తున్నాం గానీ, జగన్ రెడ్డి, ఆళ్లరామకృష్ణారెడ్డి ఏ నియోజకవర్గం మారినా, ఎక్కడ పోటీచేసినా మాకేమీ నష్టం లేదు. ఓడిపోయే వారు ఎక్కడ పోటీచేస్తే మాకేంటి?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులలో ఓటమి చవిచూసినవాడు, వచ్చే ఎన్నికల్లో అంతకంటే దారుణమైన పరాజయం చవిచూస్తాడు
జగన్ రెడ్డి ఒకవైపు లోలోన ఓటమి బాధతో కుమిలిపోతూ, పైకి మాత్రం ఇంకా వైనాట్ 175 అంటున్నాడు. నిన్న సజ్జల కూడా అదే అంటున్నాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులలో ఓటమి మూటగట్టుకున్న జగన్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో అంతకంటే దారుణమైన పరాజయం చవిచూడటం ఖాయం. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుప్పం, పులివెందులలో టీడీపీయే గెలిచింది.

అలాంటి పార్టీకి స్ట్రక్చర్ లేదంటున్నారు. జగన్ రెడ్డి.. సజ్జల తెలుసుకోవాల్సింది ఏమిటంటే 40 ఏళ్లకు పైగా టీడీపీ ప్రజల అభిమానంతో గొప్ప స్ట్రక్చర్ ఏర్పాటుచేసుకుందని. వైసీపీ స్ట్రక్చర్ ఏమిటంటే, వాలంటీర్లు.. ఐప్యాక్ సంస్థే. వేలకోట్ల ప్రజలసొమ్ముని వాలంటీర్లకు, ఐప్యాక్ సంస్థకు దోచిపెడుతూ, ఆ వ్యవస్థల్ని నమ్ముకొని జగన్ రెడ్డి మిడిసిపడుతున్నాడు.

రాజకీయ ప్రయోజనాలకోసం సొంత బాబాయ్ ని చంపించినవాడు, తన స్వార్థంకోసం తనపార్టీలోని దళిత, బీసీ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని బలి చేయడా?
వైసీపీ ఓడిపోయే స్థానాల్లో కావాలనే జగన్ రెడ్డి బీసీలు, దళితుల్ని నియమిస్తు న్నాడు. టీడీపీ పుట్టిందే బీసీలు, దళితులకోసం. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలో అన్నివర్గాలకు సమప్రాధాన్యత ఉంటుంది. వైసీపీలో దళితులకు గౌరవం ఉందా? దళిత ఎమ్మెల్యేలు, మంత్రుల్ని జగన్ రెడ్డి, అతని పార్టీ ఎంత బాగా గౌరవిస్తాయో చూస్తూనే ఉన్నాం. కనీసం వారికి కూర్చోవడానికి కుర్చీలు కూడా ఇవ్వని దుస్థితి. ఆత్మగౌరవం తాకట్టుపెట్టి మరీ సిగ్గులేకుండా బతుకుతున్నందుకు ముందు వైసీపీలోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రుల్ని అనాలి. వైసీపీ దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు తమ రాజకీయ భవిష్యత్ ఏమిటా అని వణికిపోతున్నారు.

జగన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనా లకోసం సొంత బాబాయ్ నే చంపించాడు. తల్లి, చెల్లే అతని వద్దకు రావడానికి వణికిపోతున్నారు. ఇప్పటికే వైసీపీఎమ్మెల్యేలు చాలామంది జగన్ రెడ్డికి గుడ్ బై చెప్పి షర్మిల ఏమైనా ఏపీలో అడుగుపెడుతుందేమో అని ఎదురుచూస్తున్నారు. జగన్ రెడ్డి ఎవరిని ఎటుమార్చినా, ఎవరికి టిక్కెట్లు ఇచ్చినా ప్రజలు వైసీపీని భరించే స్థితిలో లేరు. అధికారపార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదని అన్ని సర్వేలు తేల్చాయి. జగన్ రెడ్డి ఆ సర్వేల వివరాలు దాచి, మాయమాటలతో తన పార్టీ వారిని మోసగిస్తున్నాడు. ఎమ్మెల్యేలు, మంత్రుల్ని ట్రాన్స్ ఫర్ చేయడం మానేసి ముందు జగన్ రెడ్డి తనకు తాను ట్రాన్స్ ఫర్ అవ్వాల్సి.

పులివెందులలో గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనపార్టీని గెలిపించలేని జగన్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాడా? మంత్రిగా ఉన్నవారినే ప్రజలు నమ్మకపోతే, వారే ఇతర నియోజక వర్గాలకు పారిపోతున్నారు అంటే, వైసీపీపై ఏస్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ ఎన్నిమార్పులు, చేర్పులుచేసినా ఆయనకు అధికారం కల్లే. ఎన్నికలు ముగిసి అధికారం కోల్పోయిన మరుక్షణం జగన్ రెడ్డి తన కేసుల్లో జైలుకు వెళ్లడం తథ్యం. జగన్ రెడ్డికి, అతనిపార్టీకి అసలు ఒక అజెండా ఉందా? 24 గంటలు.. వారం రోజులు…365 రోజులూ అవినీతి దోపిడీలే జగన్ రెడ్డి అజెండా.

ప్రజలు వైసీపీని సాగనంపడానికి రోజులు లెక్కబెడుతున్నారు
వైసీపీనిచూసి టీడీపీ ఏడవడం కాదు.. జగన్ రెడ్డి చర్యలతో సొంతపార్టీ ఎమ్మెల్యే లు, మంత్రులు ఏడుస్తున్నారని సజ్జల గ్రహించాలి. వైసీపీలో ఎక్కడైనా మచ్చు కైనా ప్రజాస్వామ్యం ఉందా? 2019లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఈ నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డిని కలిశారు? ఎంతమంది తమ నియోజకవర్గాల కోసం ముఖ్యమంత్రితో మాట్లాడారు? ప్రజలు అన్నీ గమనించే, వైసీపీని సాగనం పడానికి రోజులు లెక్కబెడుతున్నారు.” అని ఆనంద్ బాబు స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE