Suryaa.co.in

Telangana

బిహారీ శాసనసభ్యులు వ్యవహరిస్తున్న సరైనది కాదు

– పీపుల్స్ బడ్జెట్ ను బిఆర్ఎస్ తట్టుకోలేకపోతున్నది
– ద్రవ్య వినిమయ బిల్లు పై చర్చ సందర్భంగా శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ఈ వార్షిక సంవత్సరం పీపుల్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రజలు హర్షాతిరేకాలు ప్రదర్శిస్తుంటే బిఆర్ఎస్ తట్టుకోలేకపోతున్నది.

సభా మర్యాదలు, సభలో విలువలు, సభా సంప్రదాయాలు పాటించకుండా సభలో చప్పట్లు కొడుతూ శాసనసభ సంప్రదాయాలను మంట కలుపుతున్నారు.

టిఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఓపిగా నేను ఎదురుగానే కూర్చున్నాం. మమ్మల్ని మాట్లాడకుండా గొంతు నొక్కినప్పుడు, అవహేళన చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇలా బీఆర్ఎస్ మాదిరిగా వ్యవహరించలేదు.

సభా సంప్రదాయాలు, విలువలు మీ, మర్యాదలను పాటించకుండా వెల్ ల్లోకి దూసుకొచ్చి చప్పట్లు కొట్టలేదు. బిహారీ శాసనసభ్యులు వ్యవహరిస్తున్న సరైనది కాదు అంటూనే ద్రవ్య వినిమయ బిల్లు పాస్ చేయాలని స్పీకర్ ను కోరారు

LEAVE A RESPONSE