Suryaa.co.in

Telangana

రేవంతన్నా.. మోసం చేసిందెవరన్నా?

-రేవంత్ విమర్శలపై సబిత తనయుడు, బీఆర్‌ఎస్ యువనేత కార్తీక్‌రెడ్డి ట్వీట్

హైదరాబాద్: తనను సబితా ఇంద్రారెడ్డిమోసం చేశారంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సభలో చేసిన ఆరోపణలకు సబిత స్పందించగా.. ఆ తర్వాత ఆమె తనయుడైన బీఆర్‌ఎస్ యువనేత కార్తీక్‌రెడ్డి కూడా ఎక్స్ వేదికగా రేవ ంత్ వ్యాఖ్యలకు స్పందించారు.

కార్తీక్ ఏమన్నారంటే..
సరే రేవంత్ అన్న, మీరు 2019 సంవత్సరంలో మేము నిన్ను వదిలి పార్టీ మారాము అనేది మీ బాధ అయితే ?.. ఆరోజు మీ కనుల ముందు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు మిమ్మల్ని మేము పార్టీలోకి తీసుకువచ్చాం అని అక్కసుతో నన్ను, మా అమ్మని నానా ఇబ్బందులు పెడుతున్నప్పుడు, వాళ్ళు నన్ను, మా కుటుంబాన్ని రాజకీయ సమాధి చేయాలి అని ప్రయత్నం చేసినప్పుడు, మీరు ఎక్కడికి పోయారు అన్నా ?

అందరికీ నోరారా ‘మా అన్న రేవంత్ అన్న’ అని చెప్పుకున్న నన్ను , నాకు అవసరం ఉన్నప్పుడు ఒక అండగా ఉండాల్సిన సమయంలో అనాధగా వదిలి వెళ్ళింది మీరు కాదా అన్నా ?

2018 సంవత్సరంలో నా రాజకీయ భవిష్యత్ కోసం ఒక మాట సహాయం చేయండి అన్నా అని వేడుకుంటే, “నా చేతిలో ఏమి ఉంది” అని చెప్పి నాగుండెకు మానలేని గాయం చేసింది మీరు కాదా అన్న?

పార్టీలు మారిన ఎప్పుడూ మీరూ- వదినమ్మ బాగుండాలి అని కోరుకున్న వాళ్ళము మేము. మీ నాశనము ఎప్పుడు కోరుకోలేదు మేము. బాధ అనేది మీకు ఎంత కలిగిందో దానికి రెట్టింపు బాద నాకు కలిగింది అన్న. ఎవరికి ఎవరు మోసం చేశారు? ఎవరి వల్ల ఎవరికి లాభం జరిగింది అనేది ఆ దేవుడికి తెలుసు అన్నా.

LEAVE A RESPONSE