Suryaa.co.in

Telangana

డీజీపీ,సీపీకి సోయి లేదా?

– పోలీసుల కనుసన్నల్లోనే కేటీఆర్ పై దాడి
-మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి

హైదరాబాద్: మూసీ పరివాహక ప్రాంతాల భాదితులను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్ కాన్వాయ్ పై దాడి చేశారు.పోలీసుల కనుసన్నల్లోనే పథకం ప్రకారం ఈ దాడి జరిగిందిట్రాఫిక్ సిగ్నల్ ను ఆపి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసేందుకు పోలీసులు సహకరించారు. కేటీఆర్ కారుపై ఎక్కి దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు.

వరద భాదితులు, మూసీ నిర్వాసిత భాదితులను పరామర్శించేందుకు వెళ్లిన బిఆర్ఎస్ నేతలపై దాడులు చేశారు. భయపెట్టి పాలన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. డీజీపీ,హైదరాబాద్ సీపీ తమ సిన్సియారిటీ నిరూపించుకోవాలి.

మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయం. అధికారులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో మేము లిస్ట్ రెడీ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీతో వుండే వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను స్పెషల్ పర్పస్ వెహికిల్ లా మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీని పాత నాయకులు రక్షించుకోవాలి.

డీజీపీ,సీపీకి సోయి లేదా? ఖమ్మం పోలీస్ కమీషనర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పని చేస్తున్నారు. ఖమ్మంలో మాపై దాడి చేసి మా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు దాడులపై చర్యలు తీసుకోకపోతే
పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రక్షణ లేకపోతే ఎట్లా? దమ్ముంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మూసీ నిర్వాసితుల వద్దకు వెళ్లి మాట్లాడాలి మూసీ ప్రణాళిక,డి.పి.ఆర్ ప్రభుత్వం వద్ద ఉందా?

పోలీస్ కమిషనర్ ఆఫీస్ తెలంగాణ భవన్ పక్కనే ఉంది. తెలంగాణ భవన్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తే కమిషనర్ ఏం చేస్తున్నట్టు ?ఎవరి మీద కేసులు పెట్టారు ? పోలీసులు కాంగ్రెస్ దాడులను ఆపకపోతే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది.పోలీసులు మాకు రక్షణ కల్పించకపోతే మాకు ఏం చేయాలో తెలుసు. ఇకనైనా పోలీసులు తమ భాద్యతలను సక్రమంగా నిర్వర్తించాలి.

LEAVE A RESPONSE