– నేను ఇచ్చినా అధికారులు తిరస్కరించారు కదా?
– చెవిరెడ్డి గతంలో ఇదే శ్రీకాంత్కు లేఖ ఎలా ఇచ్చారు?
– దాని ఆధారంగానే కదా శ్రీకాంత్కు పెరోల్ వచ్చింది?
చంద్రబాబు నాయుడు మా చేతులు కట్టేశారు
– నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు: శ్రీకాంత్ పెరోల్ విషయంలో రాష్ట్ర వైసీపీ నేతలు వైసీపీ రూరల్ ఇంచార్జ్, వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. శ్రీకాంత్ కి పెరోల్ ఇవ్వాలని ఆయన తండ్రి నా దగ్గరకి వస్తే సిఫార్సు లేఖ ఇచ్చాను.
వివిధ సమస్యలతో వచ్చే వారికి ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తారు. అధికారులు వాటిని పరిశీలించి సమాధానం చెబుతారు. జూలై 16న నా లేఖ, గూడూరు ఎమ్మెల్యే సునీల్ లేఖలను తిరస్కరిస్తూ అధికారులు మా ఇద్దరికీ రాత పూర్వక సమాధానం ఇచ్చారు.
జులై 30న అధికారులు పెరోల్ మంజూరు చేశారు. 16వ తేదీ మా లేఖలని తిరస్కరించి 14 రోజుల తర్వాత పెరోల్ మంజూరు చేశారు. దీనిపై విచారిస్తున్నామని హోమ్ మంత్రి చెప్పారు.
లేఖలు ఇవ్వడమే తప్పు అని వైసీపీ అంటోంది. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య లు ఇదే శ్రీకాంత్ కి లేఖలు ఎలా ఇచ్చారు. ఆ లేఖలు ఆధారం చేసుకుని శ్రీకాంత్ కి పెరోల్ కూడా ఇచ్చారు?
ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలని నేను తప్పు పట్టను, లేఖలు ఇవ్వడం సాధారణం, అధికారులు నియమ నిబంధలకి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఇకపై నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం, ఎవ్వరికీ పెరోల్ విషయంలో లేఖలు ఇవ్వను. ప్రతి విషయం రాజకీయ నాయకులకి పాఠాలు నేర్పిస్తుంది. నేను రాజకీయాల్లో నిరంతర విద్యార్థినే.
నేను దందాలు చేసి ఉంటే అధికారానికి 18 నెలల ముందే నేను ముఖ్యమంత్రి జగన్ ని విభేదించి బయటకు వచ్చా. నా మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? 2004 నుంచి 2014 మధ్యలో రూరల్ లో అప్పటి అధికార పార్టీ ఇంచార్జ్ గా ఇప్పటి వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న వ్యక్తి హయాంలో హత్యలు, ఇసుక, గ్రావెల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడుదామా?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ లో ఏ ఒక్క వైసీపీ కార్యకర్తని అయినా వేధించామా. దాడులు చేసామా.?
అధికారంలో నుంచి 18 నెలల ముందు నేను బయటకి వచ్చినప్పుడు నన్ను, నా కుటుంబ సభ్యులని, మా నాయకులని మీరు ఎలా వేదించారో గుర్తు చేసుకోండి ఆ వేధించిన వారిపై నేను ప్రతీకారం తీర్చుకోవాలంటే చుక్కలు చూపించేవాడిని, నరకం ఎలా ఉంటుందో చూపించేవాడిని.
చంద్రబాబు నాయుడు మా చేతులు కట్టేశారు. లోకేష్ అంగీకరించరు కాబట్టి సైలెంట్ గా ఉన్నాం. గీత దాటితే చంద్రబాబు తాట తీస్తారు కాబట్టి వారి అదేశాలని తూచా తప్పక పాటిస్తున్నాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలు, మంత్రులకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఖచ్చితమైన సూచన చేశారు. నా వెంట నడిచిన అనేక మంది కార్యకర్తలకి నేనే వ్యక్తిగతంగా ఆర్ధిక చేయూతని అందించా. కార్యకర్త భుజంపై చెయ్యి వేసి నవ్వితే సరిపోదు. వారి పరిస్థితి తెలుసుకోవాలి.
వైసీపీ నేతలరా .. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేద్దాం. అంతే కాని నన్ను గెలకవద్దు. అవసరం అయితే మీ బాషలోనే ఇంకా పదింతలు మాట్లాడగలం.