– ఫేక్ అడ్వకేట్ నరేష్ సుంకర 50 లక్షల వసూళ్లు
– మీడియా ప్రతినిధుల ముసుగులో బ్లాక్మెయిల్ చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్న మాఫియా గుట్టురట్టు
– అందరి జీవితాల్లో వెలుగు నింపుతామని ప్రచారం చేసుకునే డిజిటల్ మీడియా ప్రతినిధి, ఫేక్ అడ్వకేట్ నరేష్ సుంకర, ప్రవీణ్ అనే ముగ్గురిపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన హైడ్రా
హైదరాబాద్: తుక్కుగూడ మునిసిపాలిటీ మంఖాల్ గ్రామం పరిధిలో వర్టెక్స్ అనే కంపెనీ లే అవుట్ వేయగా సూరం చెరువును ఆక్రమించి కొత్తకుంటలో మట్టిపోసి బాక్స్ డ్రైన్ నిర్మించారని ఫిర్యాదు హైడ్రాకు అందింది
ఈ వ్యవహారంపై అందరి జీవితాల్లో వెలుగు నింపుతామని ప్రచారం చేసుకునే డిజిటల్ మీడియా ప్రతినిధి కొన్నిరోజుల కిందట తన యూట్యూబ్ ఛానల్లో హంగామా చేయగా, ఫేక్ న్యాయవాదిగా చలామణి అవుతూ ఇటీవల బార్ కౌన్సిల్ నుండి తొలగించిన నరేష్ సుంకర తోడయ్యాడు
హైడ్రా నిర్మాణ సంస్థ విచారణ చేపట్టగా వర్టెక్స్ కంపెనీపై రెండు కేసులు నమోదు చేసింది. తమ భూమిని సైతం వర్టెక్స్ సంస్థ ఆక్రమించి రోడ్డు నిర్మించిందని చైతన్యరెడ్డి అనే మహిళ హైడ్రాకు ఫిర్యాదు చేశారు
రోడ్డును తొలగించాలనే ఫిర్యాదుతో ఇరు వర్గాలతో హైడ్రా విచారణ జరుపుతున్న నేపథ్యంలో మాకు హైడ్రా అధికారులు తెలుసని, చైతన్య రెడ్డికి న్యాయం చేస్తామని ఆమె నుండి వీరంతా కలిసి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తేలగా వారిపై హైడ్రా అధికారులు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు