సీఎంతో కలిసి ఘన స్వాగతం పలికిన మంత్రి లోకేష్
విజయవాడ: రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విజయవాడ కనకదుర్గమ్మను ఉపరాష్ట్రపతి దర్శించుకోనున్నారు. పున్నమిఘాట్ వద్ద జరిగే విజయవాడ ఉత్సవ్ లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.