* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* వడ్డెర సామాజిక వర్గీయులకు ఆర్థిక, సామాజిక భరోసే మా లక్ష్యం
* వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజుల్లో 15 శాతం కేటాయింపులు
* సీనరేజీలో 50 శాతం మినహాయింపు బిల్లుకు కేబినెట్ లో ఆమోదం
* ఈ బిల్లుతో వడ్డెర్లకు ఆర్థిక మేలు అంటూ మంత్రి సవిత హర్షం
* సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ , మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు
అమరావతి : వడ్డెర్లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వారిని ఆర్థికంగా మేలు చేయడమే సీఎం చంద్రబాబు సంకల్పమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. దీనిలో భాగంగానే వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు కేటాయింపుల్లో 15 శాతం మేర రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. సీనరేజీలో 50 శాతం మినహాయింపు ఇవ్వడానికి కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలో గురువారం జరిగిన కేబినెట్ భేటీలో మంత్రిమండలి బిల్లు కూడా ఆమోదించిందని తెలిపారు. ఎన్నికల ముందు యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని నెరవేర్చడంపై హర్షం వ్యక్తంచేశారు. మాటల నిలబెట్టుకున్నందకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేశ్ కు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ముందు మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహించారని, ఆ సమయంలో వడ్డెర సామాజిక వర్గీయులు ఆయన్ని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారన్నారు. రాళ్లు కొట్టడం, మట్టి పనులు చేసుకోవడం తమ జీవనోపాధిని, ప్రభుత్వ ఆధీనంలోని కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు కల్పిస్తే తాము గౌరవప్రదంగా జీవనం సాగిస్తామని మంత్రి లోకేశ్ కు అప్పట్లో వినతిపత్రం అందజేశారు.
వడ్డెర సామాజిక వర్గీయులు వినతికి సానుకూలంగా స్పందించిన లోకేశ్, తాము అధికారంలోకి రాగానే తప్పకుండా న్యాయం చేస్తామని అప్పట్లో భరోసా ఇచ్చారని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు కేటాయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో భేటీ అయిన మంత్రిమండలి సమావేశంలో మైనింగ్ లీజుల్లో వడ్డెర సొసైటీలకు 15 శాతం మేర రిజర్వేషన్లు కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు.
సీనరేజీలో కూడా 50 శాతం ఫీజు మినహాయించాలని ఆ బిల్లులో ఉందన్నారు. ఎన్నికల హామీని నెరవేర్చినందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. మైనింగ్ లీజుల్లో కేటాయింపులు, సినరేజీ మినహాయింపులపై కూటమి ప్రభుత్వం త్వరలోనే జీవో జారీచేయనుందని వెల్లడించారు.
త్వరలో ప్రారంభం కాబోయే ఆదరణ 3.0 పథకంలో వడ్డెర్లకు ప్రాధాన్యమివ్వనున్నామన్నారు. మైనింగ్ లో వినియోగించేలా వడ్డెర్లకు ఆధునిక మిషన్లు అందజేయాలని నిర్ణయించామన్నారు. వెనుకబడిన వడ్డెర్లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. అందుకనుగుణంగా మైనింగ్ లీజుల కేటాయింపుల్లో వడ్డెర సొసైటీలకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.