Suryaa.co.in

Andhra Pradesh

బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని కుటుంబాన్ని పరామర్శించిన ఏబీవీపీ బృందం

గత వారంలో సత్యసాయి జిల్లా గోరంట్లలో దారుణంగా అత్యాచారం చేసి హత్యకు గురైన భీ ఫార్మసి విద్యార్థిని తేజస్విని కుటుంబాన్ని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి నాగోతు హరి కృష్ణ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ హత్య కేసులోని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ, ఇది లవ్ జిహాద్ లో భాగంగా ఈ హత్య జరిగిందని ఆరోపించారు. తక్షణమే ఆమె కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నిందితులను కఠినంగా శిక్షించని యెడల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని… ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు చిన్నా శ్రీరామ్, రాష్ట్ర విశ్వ విద్యాలయల కన్వీనర్ చెన్నయ్య, అనంతపురం జిల్లా కన్వీనర్ అఖిల్ కుమార్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ హర్ష,బాబు విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE