Suryaa.co.in

Andhra Pradesh

సీఐ కనకారావు గతంలో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దళిత క్రిస్టియన్

– ఎమ్మార్వో అతను దళిత హిందువని ధృవీకరణ పత్రం ఎలా ఇస్తాడు?
– ఎస్సీమాల వర్గానికి చెందినవాడని కులధృవీకరణ పత్రం ఎలా ఇస్తాడు?
– కనకారావు గన్నవరమే అయితే, అతను అదేప్రాంతంలో సీఐ గా పనిచేయడానికి అర్హుడుఎలా అవుతాడో కృష్ణా జిల్లాఎస్పీ సమాధానంచెప్పాలి
– కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో దళిత పోలీస్ అధికారి కనకారావు బలికాబోతున్నాడు
– రోజంతా ఎక్కడెక్కడో తిప్పి, అతన్నిచావగొట్టి, మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లమని ఎస్పీ జాషువాకి ఏచట్టం చెప్పింది?
– రాజకీయ కక్షతో జగన్ ఆడుతున్న నేరజూదంలో కొందరు దళితపోలీసులు బలవుతున్నారు. వారిని తమస్వార్థానికి వాడుకుంటున్న పోలీస్ అధికారుల్ని, ప్రభుత్వాన్ని దళితపోలీసులు నిలదీయకపోతే, భవిష్యత్ లో వారి జీవితాలు, కుటుంబాలే నష్టపోతాయి.
• కనకారావులాంటి దళిత పోలీసులు ఎందరో జగన్ ఆడే నేరజూదంలో పావులుగా మారి, వారిజీవితాల్ని వారే నాశనంచేసుకోబోతున్నారు అనిచెప్పడానికి బాధపడుతున్నాం.
• టీడీపీ జాతీయ కార్యలయం పై దాడి ఘటన మొదలు, నిన్నటి గన్నవరం విధ్వంసకాండవరకు ప్రతిదానిలో బాధితులపైనే పోలీసులు తప్పుడుకేసులు పెట్టారు.
• పట్టాభి కులంపేరుతో దూషించాడు అంటున్న సీఐ కనకారావు గతంలో తాను ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దళిత క్రిస్టియన్ (బీసీ.సీ) వర్గానికి చెందుతాడు.
• అది తెలిసి గన్నవరం ఎమ్మార్వో అతను దళితహిందువని ధృవీకరణ పత్రం ఎలా ఇస్తాడు?
• కనకారావు దళితహిందువై, గన్నవరం ప్రాంతానికి చెందినవాడైతే, అతను అక్కడ సీఐగా పనిచేయడం చట్టవిరుద్ధంకాదా?
– టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు

ఏపీ పోలీస్ వ్యవస్థ జగన్ రెడ్డి ఆదేశాలప్రకారం నడుచుకోవడం చూస్తుంటే, బాధ ఆశ్చర్యం కలుగుతున్నాయని, ముఖ్యమంత్రి నేరజూదంలో దళిత పోలీస్ అధికారులే ప్రధానంగా బల వుతున్నారని, ఇదేపద్ధతి కొనసాగితే ఏపీలోని దళిత పోలీసుల జీవితాలు, వారికుటుంబాలు ఏమవుతాయోనన్న ఆందోళన కలుగుతోందని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే మీకోసం…!

“గన్నవరం విధ్వంసకాండకు కారకులైన వైసీపీగూండాలు, వల్లభనేని వంశీల చర్యల్ని పోలీ సులు చూస్తూఉండటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. వైసీపీగూండాలు, రౌడీలు కర్రలు, రాళ్లు, పెట్రోల్ క్యాన్ లతో టీడీపీకార్యాలయంపైకి దాడికి వెళ్తుంటే, పోలీసులు వారిని అయ్యా… బాబూ… అన్నాతమ్ముడూ అని బతిమాలుకుంటున్న తీరు చూశాక, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఇంతదుస్థితికి దిగజారిందా అని ప్రతిఒక్కరికీ అనిపించింది. పోలీసులు దేశంలో ఎక్క డైనా బాధితులు, ముద్దాయిలు ఎవరని నిర్ణయించి, జరిగిన ఘటనల్ని బేరీజువేసుకొని చట్ట ప్రకారం వ్యవహరిస్తారు. కానీ రాష్ట్రంలో మాత్రం పోలీసులు బాధితుల్నే నిందితులుగా మార్చి తప్పుడుకేసులు పెడుతున్నారు. టీడీపీ జాతీయకార్యాలయంపై జరిగినదాడి మొదలు, మాచర్ల…గన్నవరం విధ్వంసకాండ వరకు ప్రతిదానిలో పోలీసులే దగ్గరుండి వైసీపీ గూండా లు, రౌడీలను దాడికి ప్రోత్సహించారని స్పష్టమవుతోంది. వైసీపీ కిరాయిమూకలకు అండగా ఉంటూ బాధితుల్నే పోలీసులు చావగొట్టడం, తిరిగివారిపైనే తప్పుడుకేసులు పెట్టడం ఏపీలో నే చూస్తున్నాం. సీసీ.కెమెరాల్లో కనిపిస్తున్నా.. బాధితుల తప్పులేదని ప్రజలు చెబుతున్నా … ఏపీ పోలీస్ మాత్రం ప్రభుత్వం ఏంచెబితే అదే చేస్తోంది. పోలీసులే బాధితుల్ని వేధిస్తుంటే .. ప్రజలకు న్యాయంచేసేదెవరు? సీఐకనకారావుది పలానా కులమని విజయవాడలో ఉండే పట్టాభికి తెలుసా?

వైసీపీవాళ్లు నాభూమిలాక్కున్నారని బాధితులుఫిర్యాదు చేయడానికి వెళ్తే, పోలీసులు భూ మి ఇచ్చేయాలని ఉచితసలహా ఇస్తున్నారు. అలానే తమకు అన్యాయంజరిగిందని, తమ బిడ్డను వేధించారని, అత్యాచారంచేశారని, తమఆస్తుల్ని కొట్టేశారని ఇలా రకరకాల సమస్య లతో ఠాణాలను ఆశ్రయించే ప్రజలకు న్యాయందక్కకపోగా, స్థానిక పోలీసులు వ్యవహ రిస్తు న్న తీరు వారిని విస్మయానికి గురిచేస్తోంది. ప్రభుత్వం ఆడే వికృత క్రీడ కొందరు దళిత పోలీస్ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది బాధితులపై పెట్టే కేసుల్లో ఫిర్యాదుదారులుగా మా రుతున్నారు. గన్నవరం దుర్ఘటనలో బాధితులు టీడీపీ వారు అయితే, సీఐ కనకారావు వైసీపీ నేతల ప్రోద్భలంతో టీడీపీ నేత పట్టాభిపై తప్పుడుకేసులు పెట్టాడు. సీఐ కనకారావుది పలా నా కులమని టీడీపీనేత పట్టాభికి తెలుసా? కనకారావు ఎస్సీవర్గానికి చెందినవ్యక్తని విజయ వాడనుంచి వచ్చిన పట్టాభికి తెలుస్తుందో..లేక అక్కడున్న వైసీపీనేతలకు తెలుస్తుందో కృష్ణా జిల్లాఎస్పీ చెప్పాలి. రాష్ట్ర పోలీస్ విభాగం వ్యవహరిస్తున్న తీరు పోలీస్ మాన్యువల్ లో ఉం దా.. లేక ఐపీసీ చట్టాల్లో ఉందో చెప్పాలి. పట్టాభిని అపహరించిన పోలీసులు ఆయన భార్యకు ఇచ్చిన అక్యూజ్డ్ అరెస్ట్ సమాచార పత్రంలోని ఖాళీలన్నీంటినీ పూరించకపోవడం చట్టవిరుద్ధంకాదా? మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడినప్పుడు ఆ ముష్కరమూక తో కలిసి ఎస్టీ వర్గానికి చెందిన షుక్రూనాయక్ అనే కానిస్టేబుల్ కార్యాలయంలో నికి వచ్చాడు. అతన్ని టీడీపీవారుపట్టుకొని పోలీసులకుఅప్పగించి, అతనిపై చర్యలు తీసుకో వాలని కోరితే, పోలీస్ అధికారులు అతనితో టీడీపీ వారిపైనే తప్పుడు కేసులు పెట్టించారు. అ లానే నిన్న గన్నవరం విధ్వంసకాండలో సీఐకనకారావుతో పట్టాభిపై తప్పుడుకేసు పెట్టించారు.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిచేసిన వైసీపీ గూండాలను కాపాడటానికే సీఐ కన కారావు, స్థానికఎస్పీ జాషువా పట్టాభిపై తప్పుడుకేసులు పెట్టారు. వారిద్దరూ కూడా ముఖ్య మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఆపనిచేశారు. గన్నవరం విధ్వంసకాండ జరిగిన నాడు పట్టాభిని అపహరించిన పోలీసులు, అదేరోజు కోర్టులో హాజరుపరచకుండా, ఒక రోజంతా ఎక్కడెక్కడో తిప్పి, అతన్నిచావగొట్టి, మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లమని ఎస్పీ జాషువాకి ఏచట్టం చెప్పింది? పట్టాభిని నిజంగా రౌడీలే అపహరిస్తే పోలీసులు వారినెందుకు అరెస్ట్ చేయలేదు? పట్టాభి అపహరణ వ్యవహారంలో పోలీసులే రౌడీలుగా ప్రవర్తించారు. తన భర్త ఎక్కడున్నాడో చెప్పాలని పట్టాభి సతీమణి పోలీసుల్ని నిలదీస్తే, సిగ్గులేకుండా పోలీస్ వారు ఖాళీగాఉన్నసమాచారపత్రాన్ని అందిస్తారా? పోలీసులు ఇచ్చిన అక్యూజ్డ్ అరెస్ట్ సమా చారంలో తేదీ, ప్రదేశం, సమయం, సందర్భం, అరెస్ట్ కాబడినవ్యక్తి పేరు ఏవీలేవు. అసంపూర్తి సమాచారం ఇచ్చిన స్థానిక ఎస్.హెచ్.వో పై తాము ఎందుకు ఫిర్యాదుచేయకూడదు? తాము దానిపై ప్రశ్నిస్తామని తెలిసి, తరువాత ఖాళీలన్నీ పూరించి మరోపత్రం ఇచ్చారు. ఈ విధంగా పోలీసులు ఎవరి ప్రోద్భలంతో పనిచేస్తున్నారు? పట్టాభిపై సీఐతో తప్పుడుకేసు పెట్టించిన పో లీసులు, అతనికుల ధృవీకరణ పత్రాన్నికూడా అప్పటికప్పుడే సృష్టించారు. హిందూమాల గా తనను నిర్ధారించి, కులధృవీకరణ పత్రంఇవ్వాలని కనకారావు కోరినట్టు, గన్నవరం వీఆ ర్వో సిఫార్సుచేస్తే, గన్నవరం ఎమ్మార్వో ఎలాఇస్తాడు?

కనకారావు పుట్టింది పశ్చిమగోదావరి జిల్లాలో అయితే, గన్నవరం ఎమ్మార్వో ఎస్సీమాల వర్గానికి చెందినవాడని కులధృవీకరణ పత్రం ఎలా ఇస్తాడు? ఒకవేళ కనకారావుది గన్నవరమే అయితే, అతను అదేప్రాంతంలో సీఐ గా పనిచేయడానికి అర్హుడుఎలా అవుతాడో కృష్ణా జిల్లాఎస్పీ సమాధానంచెప్పాలి. ఈ తతం గం మొత్తం గమనిస్తే జగన్ రెడ్డి ఆడిన రాజకీయనేరజూదంలో, కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో దళిత పోలీస్ అధికారి కనకారావు బలికాబోతున్నాడు. నిందితులను కాపాడేందుకు బాధితుల్ని వేధిస్తూ, పోలీసులతో తప్పుడుకేసులు పెట్టిస్తున్న పోలీస్ అధికారుల్ని చట్టప్రకారం శిక్షించితీరుతాం. పట్టాభిపై కనకారావు సాయంతో పోలీసు ఉన్నతాధికారులు, దళిత పోలీసుల్ని పావులుగా వాడుకొని తప్పుడు కేసులుపెట్టించిన విధంగానేగతంలో టీడీపీఎమ్మెల్సీ అశోక్ బాబు, మహిళానేత నన్నపనేని రాజకుమారిపై కూడా తప్పుడుకేసులు పెట్టించారు. ఒక పాఠశాల కు చెందిన గేటు ధ్వంసంచేశారని చిత్తూరుజిల్లా ఏర్పేడులో 20మంది టీడీపీకార్యకర్తలపై పోలీ సులు తప్పుడుకేసులు పెట్టారు. బాధితులు ఇచ్చే ఫిర్యాదుల్ని పరిగణనలోకి తీసుకోకుండా పోలీసులే, నిందితుల తరపున టీడీపీవారిపై తప్పుడుకేసులు పెట్టిస్తున్నారు.

పోతే దళిత పోలీసులు పోతారు..తనకు, తనపార్టీవారికి వచ్చిన నష్టమేమీలేదన్నట్టు జగన్ ప్రవర్తిస్తు న్నాడు. వైసీపీఎంపీ రఘురామకృష్ణరాజు సహా, నిన్నటి పట్టాభి ఉదంతం వరకు పోలీసులు దారుణంగా టీడీపీనేతలు, కార్యకర్తల్ని చావగొట్టి, వైద్యులతో తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇప్పిస్తూ, తమ తప్పును కప్పిపుచ్చుకుంటున్నారు. దళితులరక్షణకు తీసుకొచ్చిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీచట్టాన్ని దళితపోలీసుల్ని పావులుగా వాడుకోవడానికి, వారిని బలితీసుకోవడా నికి జగన్ రెడ్డి వినియోగంచడం దుర్మార్గం. కనకారావు పట్టాభిపై పెట్టిన తప్పుడకేసులో అ తన్ని, కృష్ణాజిల్లాఎస్పీని చట్టప్రకారం శిక్షించేవరకు తాము పోరాటం చేస్తాం” అని మాణిక్యరా వు స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE