Suryaa.co.in

Andhra Pradesh

పులివెందులలో వైసీపీ నుండి టీడీపీలో చేరిక

పులివెందుల నియోజకవర్గం వైసీపీ పార్టీలో మొదటి నుండి వై.యస్ కుటుంబానికి అండగా ఉన్న నల్లపురెడ్డి పల్లి,వేంపల్లి, రావులకొలను పంచాయతీల నుండి 25 కుటుంబాలు టీడీపీలోకి బి. టెక్ రవి,ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో,౹జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు సమక్షంలో చేరిక 2019 ఎన్నికల ముందు వై.యస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మరచి మాట తప్పిన జగన్ ప్రస్తుతం విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల, రైతుల పట్ల రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలకు న్యాయం చేయకపోగా, సొంత నియోజకవర్గం రైతులను పట్టించుకోకుండా, అభివృద్ధి లేక అశ్రద్ధ భావంతో ఉన్న అసమర్థ నాయకుడు మాకు నచ్చక ఆలోచన చేసి అభివృద్ధి అంటే కేవలం చంద్రబాబుతోనే సాధ్యం అని నమ్మి పార్టీలో చేరడం జరుగుతుంది.పార్టీలోకి చేరిన వారి వివరాలు మారుజోల్ల కులవర్ధన్ రెడ్డి, హరీష్ మేకల, అశోక్ మేకల, మహేష్, రమేష్, ఓబులేసు, చంటి, మారుతి కలమల్ల, కలిబాబు,మునిస్వామి, బర్గవ్ గోగుల, నారాయణ స్వామి, వీరయ్య, వినయ్, డేరంగుల శ్రీనివాస్, మేధర గంగన్న, ఉప్పు కుమార్, పఠాన్ అన్వర్, పామిశెట్టి మహేష్, తమ్మిశెట్టి వెంకటయ్య, షేక్ రఫీ, షేక్ అమీర్, యమ్.శంకర్ లు చేరారు.

LEAVE A RESPONSE