Suryaa.co.in

Andhra Pradesh

పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు

ఎమ్మెల్యే గద్దె రామమోహన్

కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వారికి తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెంది మన టిడిపి యాప్లో అత్యధికంగా పనిచేసిన 8 మంది సభ్యులకు రాష్ట్ర పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు పంపిన ప్రశంసా పత్రాలను శు క్రవారం నాడు అశోక్ నగర్లోని తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ వారికి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ పార్టీ తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని మన టీడీపీ యాప్లో రాష్ట్ర పార్టీ పొందుపచరడం జరిగిందన్నారు. వాటిని ఎప్పటికప్పడు బూత్ స్థాయిలో వరకు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేసిన వారికి ర్యాంకులు కేటాయించి వారి శ్రమను రాష్ట్ర పార్టీ గుర్తించడం జరిగిందన్నారు. పార్టీలో గుర్తింపు పొందడానికి ఎవరి సిఫార్సులు అవసరం లేదని చేసిన పనే గుర్తింపును ఇస్తుందనడానికి వీరి దక్కిన గౌరవమే నిదర్శనమన్నారు.

ఈ ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో చల్లా ప్రసాద్, గడ్డం హరికృష్ణ, జాస్తి కవిత, కలగంటి వెంకట కిషోర్, చితంలపూడి విజయ్కుమార్ యాదవ్, గండ్ర వెలుగొండ రాజు, దుగ్గిరాల నాగకృష్ణ వంశీ, దేవళ్ళ శ్రీనివాసరావులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో గద్దె రామమోహన్ తో పాటు యువ నాయుడు గద్దె క్రాంతి కుమార్ ఉన్నారు.

LEAVE A RESPONSE