Suryaa.co.in

National

నేపాల్లో కుప్పకూలిన విమానం

18 మంది మృతి

నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 18 మంది మరణించారు. ఖాట్మండులోని త్రిభువన్ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా ‘శౌర్య ఎయిర్లైన్స్’కు చెందిన కమర్షియల్ విమానం స్కిడ్ అయి, ఫెన్సింగ్ను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగి ఫ్లైట్ పూర్తిగా దగ్ధమైంది. అందులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు.  హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ టీమ్స్ సహయక చర్యలు చేపట్టాయి. తీవ్రగాయాలపాలైన పైలట్ ను ఆస్పత్రికి తరలించారు. దగ్ధమైన విమాన శకలాల నుండి సహాయక సిబ్బంది ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం.  ఘటనా స్థలం వద్ద సహయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.

LEAVE A RESPONSE