Suryaa.co.in

Andhra Pradesh

భారతదేశ భవిష్యత్తుకు అంబేద్కర్ రాజ్యాంగమే మూలాధారం

ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ

అమరావతి ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశ భవిష్యత్తుకు రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమే మూలాధారం అని,అది లేకపోతే నేడు భారత దేశం చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేదని, దేశంలో ఈ రాజ్యాంగం అమలు వల్ల ప్రజలు స్వేచ్ఛా, సమానత్వ, స్వతంత్రాలతో, రాజ్యాంగ హక్కులతో జీవిస్తున్నారని,దీనికి ప్రధాన స్ఫూర్తి బాబాసాహెబ్ చేసిన తీవ్ర కృషియేనని, భారతదేశం పట్ల అంబేద్కర్ కున్న ముందుచూపును ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు జొన్నలగడ్డ ఉదయభాను,వడ్లమూడి రాజా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE