Suryaa.co.in

Telangana

జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని తెలంగాణ సర్కారు నియమించింది. ఈమేరకు సోమవారం మధ్యాహ్నం తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

మొత్తం 44 మంది ఐఏఎస్ లకు బదిలీలు:
ఆమ్రపాలితో పాటు మొత్తం 44 మంది ఐఏఎస్ లకు రేవంత్ రెడ్డి సర్కారు స్థానచలనం కల్పించింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్‌ కుమార్, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కొన్ని ముఖ్యమైన బదిలీలు:

  • సుదర్శన్ రెడ్డి – జీఏడీ ముఖ్య కార్యదర్శి
  • సంజయ్‌ కుమార్ – కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి
  • సవ్యసాచి ఘోష్ – పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి
  • వాణీప్రసాద్ – యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి
  • శైలజా రామయ్యర్ – చేనేత, హస్తకళల ముఖ్య కార్యదర్శి (అదనపు బాధ్యతలు: హ్యాండ్లూమ్స్‌, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్‌ ఎండీ)
  • సందీప్ కుమార్ సుల్తానియా – ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (అదనపు బాధ్యతలు: ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి)
  • అహ్మద్ నదీమ్ – అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శి (అదనపు బాధ్యతలు: టీపీటీఆర్‌ఐ డీజీ)
  • సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ – కమర్షియల్ టాక్సెస్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్
  • డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రసాద్ – రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ (అదనపు బాధ్యతలు: రవాణా శాఖ కమిషనర్)
  • ఇలాంబరితి – రవాణా శాఖ కమిషనర్

LEAVE A RESPONSE