Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం ప్రాధాన్యం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దృష్టితోనే అమరావతికి ప్రాధాన్యం ఇస్తోందని భారతీయ జనతాపార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. రాజధాని అభివృద్దికి బీజేపీ 2,500 కోట్లు గతంలో మంజూరు చేసింది. అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20వేల కోట్లు డిపిఆర్ ఓకే చేశారు. ఇంటర్నెల్స్ రోడ్ల విస్తరణకు గడ్కరీ ఆమోదం తెలిపారు. అమరావతి ఏపీ రాజధాని కాబట్టే కేంద్రం కూడా ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులతో సమావేశం జరిగింది. పురందేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే.. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మేలు చేయడమే బీజేపీ విధానం. ప్రధాని మోడీ సారథ్యంలో దేశ ప్రజల సంతోషంగా ఉన్నారు. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ బోర్డు కు మార్పులు చేర్పులు వంటి అంశాలను ధైర్యంగా మోడీ అమలు చేశారు. ఎన్డీఎ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తోంది. ఏపీకి అన్యాయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదు.

రైల్వే జోన్ విషయంలో గత ప్రభుత్వం అనుకూలమైన ప్రదేశం ఇవ్వలేదు. ఆ స్థలం మార్చాలని కోరినా గత ప్రభుత్వం స్పందించలేదు. చంద్రబాబుకు లేఖ రాశారు.. ఆమోదం రాగానే రైల్వే జోన్ పనులు జరుగుతాయి. పోలవరం విషయంలో తెలిసీ తెలియని పరిస్థితులు కొన్ని ఉత్పన్నమయ్యాయి. నిర్మాణం అయిన డయా ఫ్రం వాల్ దెబ్బ తినడం బాధాకరం. నీటి నిల్వకు ఆ ప్రాజెక్టు నిలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు డయా ఫ్రం వాల్ నిర్మాణానికి 990 కోట్లు కేంద్రం ఇస్తుంది. ఏపీ అభివృద్ది కోసం బీజేపీ వేల కోట్ల నిధులు కేటాయించింది. కూటమి ప్రభుత్వం సారథ్యంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందడం ఖాయం. సమావేశానికి టీచర్స్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (అపస్) పురంధేశ్వరికి వినతి పత్రం సమర్పించారు.

LEAVE A RESPONSE