Suryaa.co.in

Andhra Pradesh Telangana

జీఎస్టీ వసూళ్లలో ఏపీ-తెలంగాణ రెండంకెల వృద్ధి నమోదు

ఆంధ్రప్రదేశ్‌ రూ.3373 కోట్లు, తెలంగాణ రూ.4507 కోట్ల వసూళ్లు

దేశంలో మరోసారి వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదయ్యాయి. మే నెలకు గానూ మొత్తం రూ.1,57,090 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. గతేడాది మే నెలతో పోలిస్తే ఈ మొత్తం 12 శాతం అధికం. గతేడాది ఈ మొత్తం రూ.1,40,885 కోట్లుగా ఉంది. మొత్తం జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.28,411 కోట్లు కాగా.. ఎస్‌జీఎస్టీ కింద రూ. 35,828 కోట్లు, ఐజీజీఎస్టీ కింద రూ.81,363 కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సెస్సుల రూపంలో మరో రూ.11,489 కోట్లుగా వసూలైనట్లు తెలిపింది. అంతకుముందు ఏప్రిల్‌ నెలలో అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్ల మేర వసూళ్లు నమోదైన సంగతి తెలిసిందే.

జీఎస్టీ వసూళ్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్‌ రూ.3047 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు సాధించగా.. ఈ ఏడాది మే నెలలో రూ.3373 కోట్లు వచ్చాయి. 11 శాతం వృద్ధి నమోదైంది. తెలంగాణ గతేడాది రూ.3982 కోట్ల మేర వసూళ్లు సాధించగా.. ఈ ఏడాది మే నెలలో 13 శాతం వృద్ధితో రూ.4507 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఈ విషయంలో ఎప్పటిలానే 16 శాతం వృద్ధితో మహారాష్ట్ర 23,536 కోట్ల మేర వసూళ్లను సాధించింది.

LEAVE A RESPONSE