– సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీతో పాటు , వివిధ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను ఆహ్వానించాలి. దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖులను సమ్మిట్ కు ఆహ్వానించేందుకు ముందుగానే జాబితాను సిద్ధం చేయాలి. ఆహ్వానితులకు అనుగుణంగా ఎక్కడా లోటు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. సమ్మిట్ లో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలి.
ఇన్ఫ్రా స్ట్రక్చర్, సంక్షేమం, ఇండస్ట్రీ, వైద్యంతో పాటు వివిధ విభాగాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్లీనరీలో విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలని, టైమ్ నిడివి ముందుగానే నిర్ణయించాలి.. ఈవెంట్స్ వారీగా ఒక్కో ఈవెంట్ కు ఒక్కో సీనియర్ IAS అధికారిని బాధ్యుడిగా నియమించాలి. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన అన్ని డిజైన్లను పూర్తి చేయాలి.