Suryaa.co.in

Telangana

బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వర్తమానానికి స్ఫూర్తి దాయకం

-సచివాలయానికి అంబేద్కర్ పేరు చరిత్రాత్మకం
-ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనీయులు
-ఆర్థిక అసమానతలు తొలగించేందుకు దళిత బంధు
-గ్రామ పంచాయతీ లుగా ఆవిర్భవించిన గిరిజన తాండా
-ఆర్ధికంగా సుసంపన్నం చెయ్యడం మహిళల చెతుల్లోనే
-కుటుంబ శ్రేయస్సు మహిళలతోతోటే అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన
-వ్యవసాయ రంగానికి పెద్దపీట
-విద్యుత్ రంగంలో అద్భుతమైన విజయాలు
-పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలతో అభివృద్ధి అమోఘం
-అసంఘటిత రంగానికి సామాజిక భద్రత
-శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణా రోల్ మోడల్
-జిల్లాల ఏర్పాటుతో పరిపాలన వికేంద్రీకరణ
-వైద్య కళాశాలల పెంపుడలతో అందుబాటులోకి ఆధునిక వైద్యం
-కనీవినీ ఎరుగని రీతిలో కాళేశ్వరం నిర్మాణం
-మైనారిటీల జీవితాల్లో వెలుగులు
-బడుగుల సంక్షేమానికి భరోసా
-విద్య ఉద్యగా రంగాలలో అసమాన ఫలితాలు
-తెలంగాణా అభివృద్ధికి మోకాలొడ్డుతున్న కేంద్రం
-తెలంగాణా పై విషం చిమ్ముతున్న మోడీ సర్కార్
-విభజన హామీలపై కేంద్రం వివక్ష
-ఉపాధి హామీకి ఉరి
-ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ఆదానికి అంకితం
-ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏవి ఎక్కడ
-బి ఆర్ యస్ పై దాడుల కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసి గొల్పుతున్న మోడీ అమిత్ షా లు
-సూర్యాపేటలో బి ఆర్ యస్ నియోజకవర్గ బి ఆర్ యస్ ప్లీనరీ
-సభకు అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
-పాల్గొన్న రాజ్యసభ సభ్యులు, జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్
-సూర్యాపేట లో ఘనంగా బి ఆర్ యస్ ప్లీనరీ సమావేశాలు
-పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి సమావేశాలు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
-వేదిక మీద ఏర్పాటు చేసిన తెలంగాణా తల్లి చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం -అమరవీరుల స్థూపం వద్దనివాళులర్పించారు
-డ్రెస్ కోడ్ తో వచ్చిన న్యాయవాదులు
-ప్రారంభ ఉపన్యాసం తో సభలో పెరిగిన హోరు
-22 తీర్మానాలను ఆమోదించిన ప్లీనరీ

బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనతో పాటు సచివాలయానికి అంబెడ్కర్ పేరు పెట్టినందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభినందిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టిన మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్న పూర్ణమ్మ బలపరిచిన పెన్ పహాడ్ యం పి పి నెమ్మది బిక్షం. వ్యవసాయం-అభివృద్ధి రైతు సంక్షేమం పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి సబ్యులు ఒంటెద్దు నరసింహా రెడ్డి ప్రతిపాదనకు జడ్ పి వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ గౌడ్ బలపరిచారు. నియోజకవర్గం లో మంత్రి జగదీశ్ రెడ్డి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నా అంశంపై టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు ప్రతిపాదించగా పూర్ణ శశికాంత్ బలపరిచారు. ధరల పెరుగుదల మోడీ వైఫల్యాలపై జిల్లా నాయకులు గండూరి ప్రకాష్ ప్రతిపాదించగా సూర్యాపేట జెడ్పిటిసి జీడి బిక్షం బలపరిచారు. భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ప్రజల కర్తవ్యం పై మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ ప్రతిపాదించగా రాపర్తి శ్రీనివాస్ బలపరిచారు.

సూర్యాపేట పటిష్టమైన శాంతిభద్రతలు స్వేచ్ఛ వ్యాపారం వసూళ్ల రాజు బంద్ అంశంపై టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గుణగంటి రాములు ప్రతిపాదించగా రామగిరి నగేష్ బండారు రాజాలు బలపరిచారు. సూర్యాపేటలో పెరిగిన ప్రభుత్వ వైద్య సేవలు మెడికల్ కళాశాల ఏర్పాటు అంశంపై టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ ప్రతిపాదించగా మాజీ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత బలపరిచారు. కొత్త జిల్లాల ఏర్పాటు పరిపాలన వేకేంద్రీకరణ పై మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ ప్రతిపాదించగా జటంగి వెంకటేశ్వర్లు బలపరిచారు. సాగునీరు కాలేశ్వరం జలాలపై మరల చంద్రారెడ్డి ప్రతిపాదించగా దొంగరి యుగంధర్ బలపరిచారు. గిరిజన సంక్షేమం అనే అంశంపై చివరి జడ్పిటిసి ముఖ్య సంజీవ నాయక్ ప్రతిపాదించగా బిక్షం బలపరిచారు. మహిళా శ్రేయస్సు పై మాలి కవిత ప్రతిపాదించగా చివ్వెంల ఎంపీపీ ధరావత్ కుమారి బలపరిచారు. మైనార్టీ సంక్షేమంపై సయ్యద్ సలీం ప్రతిపాదించగా రియాజ్ బలపరిచారు. బీసీ బీసీ సంక్షేమంపై జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ ప్రతిపాదించగా తూడి నరసింహారావు బలపరిచారు.

సామాజిక భద్రతపై కరుణ ప్రతిపాదించగా సల్మా బలపరిచారు. దళిత సంక్షేమంపై తెల్లమల్ల హసేన్ ప్రతిపాదించగా చందుపట్ల పద్మయ బలపరిచారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థల దుర్వినియోగం టిఆర్ఎస్ పై దాడులు పై జివి రావు ప్రతిపాదించగా గొండ్రియల అశోక్ బలపరిచారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ పై వివక్ష చూపే అంశంపై సూర్యాపేట ఎంపీపీ వీరవోలు రవీందర్ రెడ్డి ప్రతిపాదించగా మామిడి అంజయ్య బలపరిచారు. విభజన హామీలు నెరవేర్చకపోవడం కేంద్రం వివక్ష చూపడం పై ప్రముఖ న్యాయవాది నాతి సవేందర్ ప్రతిపాదించగా పర్రెడ్డి సీతారాం రెడ్డి బలపరిచారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల అమ్మడం అదానికి అంకితం చేయడం అంశంపై బీసీ ఎం ఎస్ చైర్మన్ వడ్డే జానయ్య యాదవ్ ప్రతిపాదించగా జూలకంటి జీవన్ రెడ్డి బలపరిచారు. ఎన్నికల సమయంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన మోడీ ప్రభుత్వం పై బీరవోలు శ్రీహర్ష ప్రతిపాదించగా అనిల్ నాయక్ బలపరిచారు.

ఉపాధి హామీకి తూట్లు పరచడంపై భక్తుల ప్రసాద్ ప్రతిపాదించగా విజయచక్కున బలపరిచారు. కేంద్రంలోని మోడీ సర్కార్ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడానికి వ్యతిరేకిస్తూ గుర్రం సత్యనారాయణరెడ్డి ప్రతిపాదించగా సూర్యాపేట వైస్ ఎంపీపీ శ్రీనివాస్ నాయుడు బలపరిచారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి తో బాగుపడుతున్న పల్లెలు పట్టణాలపై చిలుముల సునీల్ రెడ్డి ప్రతిపాదించగా సుధాకర్ చింతలపాటి భరత్ లు బలపరిచారు. విద్య ఉద్యోగంపై తోట శ్యాం ప్రతిపాదించగా సంతోష్ రెడ్డి బలపరిచారు. అల్పాహారంతో పాటు భోజనాలు వేసవి తాపం నుండి ఉపశమనకొఱకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ. డెలిగేట్లకు ఎండ వేడిమి తగలకుండా ఉండేందుకు గాను ఎయిర్ కూలర్ల ఏర్పాటు. సోమవారం నుండి స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి. ఆత్మీయ సమ్మేళనంతో పాటు ఈ రోజు జరిగిన బి ఆర్ యస్ ప్లీనరీ ఏర్పాట్లపై మంత్రి జగదీష్ రెడ్డి మార్క్.

భారతదేశం గర్వించే రీతిలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జాతి గర్వించదగ్గ అంశమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అంతే గాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సచివాలయానికి అంబెడ్కర్ మహాశయుడి పేరు పెట్టడం దేశ చరిత్రలోనే చరిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు.

మంగళవారం సూర్యపేట లో ఏర్పాటు చేసిన బి ఆర్ యస్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశాలను ఆయన పార్టీ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు.అనంతరం జరిగిన సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేసిన ఆయన మాట్లాడుతూ వర్తమానానినికి స్ఫూర్తిదాయకంగా నిలిచే రీతిలో 125 అడుగుల బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యడం తో పాటు సచివాలయానికి అంబెడ్కర్ పేరును పెట్టడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. దళితుల్లో ఆర్థిక అసమానతలు తొలగించేందుకే దలిటీబంధూ పధకాన్ని ప్రారంభించారని ఆయన వెల్లడించారు.గిరిజన తాండలను గ్రామపంచాయతీలుగా రూపొందించడం ద్వారా గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని ఆయన కొనియాడారు. కుటుంబ వ్యవస్థలో ఆర్థికంగా బలపడడం మహిళల చేతుల్లోనే ఉందని గట్టిగ విశ్వసించే వారిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారని ఆయన తెలిపారు. అందుకే మహిళా పక్షపాతిగా మారి అనేక సంక్షేమ పథకాలకు రూపు నిచ్చారని ఆయన తెలిపారు.

మహిళలు ఆర్డిక స్వావలంబనను పెంపొందించే విదంగా వడ్డీ లేని రుణాలు,ఒంటరి మహిళలకు ఫించన్లు,అందించడం తో పాటు వారి ఆరోగ్య పరిరక్షణకు న్యూట్రీషియన్ కిట్ల పంపిణీ,కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్,కేసీఆర్ కిట్ ,అమ్మవడి వంటి అద్భుతమైన పధకాలను రూపిందించిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన ప్రశంసలు గుప్పించారు. అంతటితో ఆగని ఆయన మహిళల భద్రతకై షి టీమ్స్, మహిళల కష్టాలను రూపు మాపేందుకు మిషన్ భగీరధ వంటి విప్లవాత్మకమైన పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే అమలులోకి వచ్చాయని ఆయన గుర్తుచేశారు.

అసలు అభివృద్ధి, సంక్షేమం అంటేనే 2014 కు ముందు 2014 తరువాత లేదా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారానికి ముందు తరువాత అన్న పద్దతిలో చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయాన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక జరిగిన వ్యవసాయ విప్లవం యావత్ భారతదేశంలోనే పెను రికార్డులను నమోదు చేసుకుంటుందన్నారు. 2014 కు ముందు తెలంగాణా ప్రాంతంలో కేవలం 60 లక్షల ఎకరాలు మాత్రమే సేద్యానికి నోచుకోగా 2020-21నాటికి కోటి 35 లక్షల ఎకరాలు సేద్యానికి వచ్చింది అంటే అది ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత మాత్రమే నని ఆయన తేల్చిచెప్పారు. వ్యవసాయంలో 117% విజయాలను నమోదు చేసుకున్న తెలంగాణా రాష్ట్రంలో 2014 కు పూర్వం కేవలం 25 నుండి 30 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు ఉండగా అవి నేడు పంజాబ్ రాష్ట్రాన్ని మించి పోయేలా మూడు కోట్ల టన్నుల ఉత్పత్తికి పెరిగింది అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం కాదా అని ఆయన ప్రశ్నించారు.

చరిత్రలో నిలిచి పోయే విదంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి మానవ అద్భుతమైన ప్రాజెక్ట్ ను ఆవిష్కరించిన ఇంజినీర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అభినందించారు. అన్నింటికీ మించి యావత్ భారతదేశంలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ర్టంగా తెలంగాణా సరికొత్త రికార్డ్ నమోదు చేసుకుందని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ పెట్టుబడి సాయంగా రైతుబందు,రైతాంగం కుటుంబాలకు భరోసా గా రైతు భీమా పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గొప్ప మైళ్ళు రాళ్లుగా ఆయన పేర్కొన్నారు.

గడిచిన ఎనిమిదేళ్లుగా వ్యవసాయానికి వాటి అనుబంధ రంగాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 45 లక్షల కోట్లు ఖర్చు పెడితే అందులో 1.61 లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు 1.27 లక్షల కోట్లుపంటకొనుగోళ్లకు 59 వేల కోట్లు ఉచిత విద్యుత్ కు 67 వేల కోట్లు రైతుబందు పథకానికి 18 వేల కోట్లు రైతు రుణమాఫీ పథకానికి ఖర్చు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధావ్యుడనిఅని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నామన్నారు.
పల్లె ప్రగతి-పట్టణ ప్రగతి తో వైకుంఠదామలు,పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, పక్కారోడ్లతో పాటు ట్రాక్టర్ ,ట్రాలీ నీ ఏర్పాటు చేసుకుని ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఘనతి కెక్కారని ఆయన తెలిపారు. అసంఘటిత రంగానికి సామాజిక భద్రత కలిపించడంలో తనకు ఎవరరూ రారని తనకు తాను నిరూపించుకున్న నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణా యావత్ భారతదేశానికే గర్వకారణంగా నిలిచిందన్నారు.జిల్లాల ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణ జరిగి సామాన్యుడికి పాలన అందుబాటులోకీ వచ్చింది అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ చలువ కాక మరెంటని ప్రశ్నించారు.

వైద్యకళాశాలలను పెంచడంతో అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వైద్యం సామాన్యుడికి అందుతుంది అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ మహిమ మాత్రమే నన్నారు.మైనారిటీల జీవితాల్లో ముందెన్నడూ లేని ఆత్మస్థైర్యం తెలంగాణా ఏర్పడి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే పెరిగిందన్నారు.ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పర్వదినాన్ని అధికారికంగా జరిపించాడం తో పాటు ఊహించని స్థాయిలో కార్పొరేట్ విద్యను తలదన్నే రీతిలో ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకులాలు వారిలో పెరిగిన ఆత్మస్థైర్యనికి కారణమన్నారు.

బడుగుల సంక్షేమానికి భరోసా అందించడమే కాకుండా వారిని సుసంపన్నం చేసేందుకు చేపట్టిన పథకాలు అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నామన్నారు.జ్యోతిరావు పూలే ఓవర్సీస్ పేరుతో విదేశీ విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న చేయూత అభినబడనియమన్నారు.1000 కి పైగా గురుకులాలను స్థాపించి కార్పొరేట్ ను తలదన్నే రీతిలో విద్యను అందిస్తున్న తెలంగాణా ప్రభుత్వం విద్యారంగంలో అసమాన ఫలితాలు సాదించిందన్నారు.నియోజకవర్గ కేంద్రాలలో నెలకొల్పిన వైద్య కళాశాలలే విద్యా రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన ప్రగతికి నిలువుటద్దం గా నిలబడిందన్నారు.

అటువంటి అద్భుతమైన ఫలితాలు సాదిస్తూ అటు ప్రగతిని ఇటు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రం ప్రతి బంధకాలు సృష్టిస్తూ అభివృద్ధి కి మోకాలోడ్డు తుందని ఆయన కేంద్రంపై ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిందే తడవుగా మోడీ సర్కార్ తెలంగాణా పై విషం చిమ్ముతుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణా కు చెందిన ఆరు మండలాలను ఏక పక్షంగా సీమాంధ్రలో కలుపడమే తెలంగాణా పై కేంద్రం చూపుతున్న వివక్షతకు అద్దం పడుతుందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరధ కు 24 వేల కోట్లు మంజూరు చెయ్యాలంటూ నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం తెలంగాణా కు మొండి చెయ్యి చూపిందని ఆయన విమర్శించారు. యావత్ భారతదేశంలో 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేసిన బిజెపి సర్కార్ తెలంగాణా కు ఒక్కటీ అంటే ఒక్కటి ఇయ్యలేదని ఆయన ధ్వజమెత్తారు. పైగా మోటర్లకు మీటర్లు పెట్టి రైతాంగాం నుండి ముక్కుపిండి బిల్లులు వసూలు చెయ్యలేదన్న దుగ్దతో రాష్ట్రానికి రావాల్సిన 30 వేల కోట్ల రుణాలకు కోత పెట్టిన ఘనత ప్రధాని మోడీకి దక్కిందని ఆయన మండిపడ్డారు.

ఒక్కటి అంటే ఒక్కటి నవోదయ పాఠశాలలు మంజూరు చెయ్యక పోగా దేశంలో మొత్తం 8 ఐ ఐ యం లు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణా కు ఒక్కటి కూడ ఇవ్వకుండా తెలంగాణా పై తనకున్న వివక్షతకు బయట పెట్టుకుందని మంత్రి జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. పైగా టి ఆర్ యస్ బి ఆర్ యస్ గా రూపాంతరం చెందడంతో పాటు యావత్ భారతదేశం ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తుంటే తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పై మోడీ సర్కార్ ముప్పేట దాడి మొదలు పెట్టిందని ఆయన ఆరోపించారు. యేటా రెండుకోట్ల ఉద్యోగాలు అంటూ నిరుద్యోగ యువత ను మోసం చేసిన బిజెపి కి విద్యార్థి యువత గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆంద్రప్రదేశ్ కు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు. పాలనా వైఫల్యం వల్లనే రాయలసీమ నేతలు రాయల తెలంగాణా అంటూ కొత్త పల్లవిని అందుకున్నారని ఆయన పేర్కొన్నారు. టి ఆర్ యస్ బి ఆర్ యస్ గా రూపాంతరం చెందక కర్ణాటక,మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్,ఒరిస్సా రాష్ట్రాల ప్రజలు తమను తెలంగాణా లో కలపాలి లేదూ అంటే అక్కడి పథకాలు ఇక్కడ పెట్టాలి అన్న డిమాండ్ నానాటికి పెరిగిందన్నారు.ప్రస్తుతం అదే పరిస్థితి ఆంద్రప్రదేశ్ లో మొదలైందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.

LEAVE A RESPONSE