Suryaa.co.in

Andhra Pradesh

పేదలకు ఇచ్చిన మాటను నెరవేర్చిన బాబు

– తలారి గంగమ్మ, కవిత కుటుంబాలకు అండగా నిలిచిన ప్రభుత్వం
– ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పుచ్చకాయలమడ గ్రామానికి చెందిన తలారి గంగమ్మ కుమారుడు అశోక్ కుమార్ కు ఎలక్ట్రికల్ ఆటో, కవిత భర్త వైద్యం ఖర్చులకు సిఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందచేసిన జిల్లా కలెక్టర్, పత్తికొండ ఎమ్మెల్యే

కర్నూలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. మీ కష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉండడానికే పేదల సేవలో అనే కార్యక్రమం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి మంగళవారం పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో నిర్వహించిన పేదలకు సేవలో కార్యక్రమంలో ప్రజలతో చెప్పారు.

.పింఛన్ల పంపిణీ లో భాగంగా మంగళవారం పుచ్చకాయలమడ గ్రామంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్నారు.. తలారి గంగమ్మ ఇంటికి వెళ్లిన సందర్భంగా తన చిన్న కుమారుడు అశోక్ పదో తరగతి చదివి అద్దె ఆటో నడుపుతున్నాడని, ఎలక్ట్రికల్ ఆటో కావాలని గంగమ్మ ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు..ముఖ్యమంత్రి స్పందించి రేపే ఎలక్ట్రికల్ ఆటో అందచేయాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ను ఆదేశించారు.

అదే గ్రామానికి చెందిన కవిత తన భర్త రాముడుకి కర్నూలు నగరంలోని అమీలియో ఆసుపత్రిలో నరాల వ్యాధికి సంబంధించి ఆపరేషన్ చేస్తున్నారని ఆర్థికంగా సాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కోరారు.. వెంటనే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి కవిత భర్త వైద్య సేవల నిమిత్తం లక్ష రూపాయల చెక్కును ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ . బాషా, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు బుధవారం కలెక్టరేట్ లో అశోక్ కుమార్ కు రూ.3.8 లక్షల విలువ కలిగిన ఎలక్ట్రికల్ ఆటోను, కవితకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ కవిత ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లకు కృతజ్ఞతలు తెలిపారు.

గంటల వ్యవధిలో ఎలక్ట్రిక్‌ ఆటో సమకూర్చడం నమ్మలేకపోతున్నానని అశోక్ తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఆటో పంపించడం చాలా ఆనందంగా ఉందని, తన జీవితంలో చాలా మంది నేతలను చూశానని.. కానీ చంద్రబాబు లాంటి నేతను ఎప్పుడు చూడలేదని అశోక్ ధన్యవాదాలు తెలియజేశారు.

చంద్రబాబు రుణం తీర్చుకోలేమని.. తన కష్టాన్ని తీర్చి, ముఖ్యమంత్రి తన కుటుంబాన్ని ఆదుకున్నారని, ఆయన చేసిన మేలును తమ కుటుంబం ఎప్పుడూ మరచిపోదని కవిత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది.

అశోక్ కుమార్ కి ఇచ్చిన పియోగియో అపే కంపెనీ కి చెందిన ఎలక్ట్రిక్‌ ఆటో లో జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్ బాషా, పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ బాబు లు ప్రయాణం చేసి, ఆటో డ్రైవర్ అశోక్ కుమార్ కి బోనీ రూపంలో డబ్బును అందజేశారు..రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎపుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే శ్యాం బాబు లబ్ధిదారులకు ధైర్యం చెప్పారు.

కార్యక్రమంలో డిఆర్ఓ చిరంజీవి, కర్నూల్ ఆర్డీవో శేషి రెడ్డి, పత్తికొండ ఆర్డిఓ రామలక్ష్మి, పుచ్చకాయలమాడ గ్రామ పెద్ద సాంబశివారెడ్డి, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE