Suryaa.co.in

Telangana

భజరంగ్ బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ రాజకీయ జీవితం భస్మం కావడం ఖాయం

– హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప

నాగిల్ గిద్ద మండలం ఔదాత్ పూర్ లో హనుమాన్ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప స్వామివారిని దర్శించుకున్నారు. భారతదేశంలో ప్రతి గ్రామంలో బజరంగ్ భలి దేవాలయం ఉంటుందని ఆయన అన్నారు. చెడు నుంచి గ్రామాన్ని స్వామివారు రక్షిస్తారని ప్రతి ఒక్కరి నమ్మకం అని సంగప్ప చెప్పారు.

బజరంగ్ బలి భక్తులైన బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ ప్రకటించి తన చావును తానే తెచ్చుకుందని సంగప్ప పేర్కొన్నారు. దేశంలో హిందూ సమాజానికి ఎలాంటి ప్రమాదం వచ్చినా, ధైర్యంగా అండగా నిలబడేది బజరంగ్దళ్ మాత్రమే అని ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి దళ్ ను నిషేధిస్తే కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్క హిందు బొంద పెట్టడం ఖాయం అని సంగప్ప హెచ్చరించారు. ఔదాత్ పూర్ లో అందరూ కలిసి అద్భుతమైన హనుమాన్ దేవాలయం నిరించుకున్నందుకు గ్రామస్థులను సంగప్ప అభినందించారు.

ఈ కార్యక్రమం లో బిజెపి నారాయణఖేడ్ అసెంబ్లీ కన్వీనర్ రజినీకాంత్, సీనియర్ నాయకులు సాయిరాం, సంజు పాటిల్, రాజు గౌడ్, హనుమంత్, దిగంబర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE