Suryaa.co.in

Andhra Pradesh

‘పశ్చిమ’లో వైసీపీకి భారీ షాక్!

– టీడీపీలోకి ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ
– ఆమె సహా పార్టీలో చేరిన పలువురు వైసీపీ నేతలు
– కండువా కప్పి పశ్చిమగోదావరి నేతలను ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్

అమరావతి: అభివృద్ధిని కాంక్షించి పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ(టీడీపీ)లో చేరుతున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేసి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆమెతో పాటు వైసీపీ జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ గంటా ప్రసాదరావు, పామర్తి అచ్యుత్ గౌడ్, ఈ.అశోక్, ఎస్.కిషోర్, ఎస్.మురళీ, రెడ్డి కిషోర్ టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

LEAVE A RESPONSE