Suryaa.co.in

Telangana

బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు

-బూర నర్సయ్య గౌడ్ గ్రహచారం బాగాలేదు
-ప్రజాస్వామ్యం గురించి ఈటెల మాట్లాడటమా?
-బీజేపీ నేతలు కేసీఆర్ గురించి మాట్లాడితే హైద్రాబాద్ నుంచి ఉరికిస్తాం
-కేటీఆర్‌ కాలిగోటికి కూడా వివేక్ సరిపోరు
-ఈటెల వి నల్లి కుట్ల రాజకీయాలు
-టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే కె. పి. వివేకానంద, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

మునుగోడు ఫలితం తర్వాత బీజేపీ సోయి తప్పి మాట్లాడుతోంది.మునుగోడు లో నిండా మునిగినా బీజేపీ నేతలు తమదే పై చేయి అన్నట్టు మాట్లాడుతున్నారు.గుర్తుల నుంచి మొదలు అన్నింటా ఈసీ ని అడ్డం పెట్టుకుని బీజేపీ టీ ఆర్ ఎస్ ను ఓడించాలని చూసింది. టీ ఆర్ ఎస్ కు మునుగోడు లో వచ్చిన మెజారిటీ 17వేలు..పది వేలు కాదు.కారును పోలిన గుర్తు వల్ల 7 వేల ఓట్లు కోల్పోయాం. బీజేపీ కి తెలంగాణ లో స్థానం లేదని తేలిపోయింది. అభ్యర్థుల వల్లే బీజేపీ కి ఉప ఎన్నికల్లో ఓట్లు వచ్చాయి తప్ప పార్టీ ని చూసి కాదు.

వామ పక్షాలతో పొత్తు ను మేము బహిరంగంగా కుదుర్చుకున్నాం.బీజేపీ లాగా లాలూచీ రాజకీయాలు మేము చేయం. వామ పక్షాలతో పొత్తు కుట్ర ఎలా అవుతుంది? దుబ్బాక లో తక్కువ ఓట్ల తో బీజేపీ గెలిచింది.. అది గెలుపు కాదని బీజేపీ ఒప్పుకుంటుందా?గెలుపును గెలుపు గానే చూడాలి. టీ ఆర్ ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని రాజగోపాల్ చెప్పారు.దమ్ముంటే రాజగోపాల్ మాట మీద నిలబడాలి. వివేక్ తన పేరు విక్స్ బిళ్ళ వివేక్ గా మార్చుకోవాలి. కేటీఆర్‌ మీద మాట్లాడే స్థాయి వివేక్ ది కాదు. కేటీఆర్‌ ప్రపంచ స్థాయి నేత. బీజేపీ కేంద్ర మంత్రులు కూడా హైద్రాబాద్ కు వచ్చి కేటీఆర్‌ ను పొగిడిన సందర్భాలు ఉన్నాయి. వివేక్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదు.

లగడపాటి రాజగోపాల్ కోమటి రెడ్డి రాజగోపాల్ ఒక్కటే అనిపిస్తోంది.బీజేపీ దిగజారిన రాజకీయాలు చేస్తోంది. బీజేపీ కి తెలంగాణ లో స్థానం లేదు.కేసీఆర్ ,కేటీఆర్‌ ల గురించి మాట్లాడేప్పుడు బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి. మునుగోడు లో గెలిస్తే ఇంకా రెండు ఉపఎన్నికలు వచ్చేవి అని ఈటెల అంటున్నారు. ఫార్మ్ హౌజ్ ఆపరేషన్ చేసింది ఆ ఉపఎన్నికల కోసమేనా రాజేందర్ స్పష్టం చేయాలి. బూర నర్సయ్య గౌడ్ గ్రహచారం బాగాలేదు. టీ ఆర్ ఎస్ లో ఉంటే మరో ఏడాది లో బూర ఎంపీ అయ్యేవారు. బూర పిచ్చి మాటలు మానుకోవాలి.

మునుగోడు ఫలితం పై ఈటెల మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు. ప్రజాస్వామ్యం గురించి ఈటెల మాట్లాడటమా? హుజురాబాద్ హత్య రాజకీయాలను మునుగోడు కు తేవాలని ఈటెల ప్రయత్నించారు. మునుగోడు లో ఎక్కడా గొడవలు జరగలేదు.. ఈటెల అత్త గారి ఊర్లోనే ఎందుకు గొడవలు జరుగుతాయి? ఈటెల మా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ని చంపాలని కుట్ర పన్నారు. ఈటెల నేర చరిత్ర హుజురాబాద్ ప్రజలకు తెలుసు.

ఈటెల తన పీ ఏ దగ్గర దొరికిన డబ్బు గురించి ఎందుకు మాట్లాడరు? ఈటెల దమ్ముంటే హుజూరా బాద్ ఎమ్మెల్యే గా రాజీనామా చేసి గెలవాలి. నేనే టీ ఆర్ ఎస్ నుంచి పోటీ చేస్తా.. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈటెల హుజూరా బాద్ లో ఎన్నో హామీలు ఇచ్చారు.. తట్టెడు మన్నయినా తీశారా.. కేంద్ర నిధులు తెచ్చారా. లక్ష రూపాయల సీసీ రోడ్డు వేయించారా?

కేసీఆర్ మునుగోడు లో దించిన బుల్లెట్ కు బీజేపీ నేతల మైండ్ బ్లాంక్ అయ్యింది. బీజేపీ నేతలు కేసీఆర్ గురించి మాట్లాడితే హైద్రాబాద్ నుంచి ఉరికిస్తాం.వివేక్ తన తండ్రి వెంకట స్వామి ఇజ్జత్ తీస్తున్నారు. కేటీఆర్‌ కాలిగోటికి కూడా వివేక్ సరిపోరు. వివేక్ డబ్బుల రాజకీయం మునుగోడు లో పని చేయలేదు. ఖబర్దార్ వివేక్ నోరు జాగ్రత్త. ఈటెల వి నల్లి కుట్ల రాజకీయాలు.

LEAVE A RESPONSE