Suryaa.co.in

Andhra Pradesh

కృష్ణా నదిపై తీగల వంతెనకు కేంద్రం ఆమోదం

ఏపీ లోని సిద్ధేశ్వరం, తెలంగాణ లోని సోమశిల మధ్య కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నేషనల్ హైవే సంస్థ రూపొందించిన DPRను.. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆమోదించింది. వంతెన నిర్మాణం, పర్యాటక ప్రాంత అభివృద్ధికి రూ.1,519 కోట్లు వెచ్చించాలని కేంద్రం నిర్ణయించింది. వంతెన నిర్మాణానికి రూ.1,082.56 కోట్లు, పర్యాటక అభివృద్ధికి రూ.436.91 కోట్లు కేటాయించింది.

LEAVE A RESPONSE