– కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
అమరావతి : రాష్ట్ర రాజధాని అమరావతితో పాటు రాష్ట్రాభివృద్దికి, మౌలికి వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు, ప్రాజక్టులను కేటాయిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర భారీ పరిశ్రమలు & స్టీల్ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ధన్యవాదమలు తెలిపారు.
శుక్రవారం రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన అభివృద్ది పనుల పున: ప్రారంభ సభలో ఆయన మాట్లాడుతూ . అమరావతిలో రూ.58 వేల కోట్లు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టేందుకు వచ్చిన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మెదీకి ధన్యవాదములు తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంన్నారు. రాష్ట్రంలో రైల్వే రంగంలో రూ.74 వేల కోట్లు పెట్టు బడులు పెట్టడం జరిగిందన్నారు. అమరావతి ని దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం చేసేందుకు దాదాపు రూ.2,245 కోట్లతో నూతన రైల్వే లైను నిర్మాణం మరియు విశాఖ రైల్వేజోన్ నిర్మాణం కేంద్ర సహాకారంతోనే సాద్యమైందన్నారు.
పోలవరం ప్రాజక్టుకు రూ.12,500 కోట్లు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు రూ.11,500 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా పూడి మడకలో రూ.1 లక్షా 85 వేల కోట్లుతో గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం, నక్కపల్లిలో బల్కు డ్రగ్ కేంద్రం ఏర్పాటతో పాటు కృష్ణపట్నాన్ని రూ.4,500 కోట్లతో పారిశ్రామికి కేంద్రంగా తీర్చిదిద్దే పనులు కేంద్ర సహకారం వల్లే సాద్యమైందన్నారు.
రూ.2,800 కోట్లతో ఓర్వకల్లును, రూ.2,200 కోట్లతో కొప్పర్తిని పారిశ్రామిక కేంద్రాలిగా తీర్చిదిద్దేందుకు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. లక్షలాధి మంది యువతకు ఉద్యోగ అవకాశలు కల్పించే విధంగా రామాయపట్నంలో రూ.95 వేల కోట్లతో BPCL రీఫైనరీని ఏర్పాటు చేయడం జరుగుచున్నది.
జాతీయ రహదారులకు వేల కోట్ల నిధులు ఖర్చు పెట్టడం జరుగుచున్నదని, -నర్సాపురం నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బీమవరం బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.2,400 కోట్లు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు.
సిఆర్ఎఫ్ పథకం క్రిందం 200 కి.మి. రాష్ట్ర రహదారులు అభివృద్ది పెద్ద ఎత్తున నిధులను కేంటాయించడం జరిగంన్నారు. IIT, IIM, NIT, AIMS, పెట్రోలియం, సెంట్ర్రల్, సెంట్రల్ ట్రైబల్ వర్శిటీలతో పాటు పలు వైద్య కళాశాలలను రాష్ట్రానికి కేటాయించినందుకు ప్రధాన మంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.