Suryaa.co.in

Andhra Pradesh

సంక్షోభంలో సంక్షేమం నినాదంతో రేపు ఛలో అసెంబ్లీ

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు జగన్ రెడ్డి చేసిన మోసాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రేపు(20.09.2022)న ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూడున్నర సంవత్సరాలుగా జగన్ రెడ్డి సంక్షేమ పథకాలను, సంక్షేమ రంగాన్ని నిర్వీర్యం చేసింది. నవరత్నాల పేరుతో బడుగుల సంక్షేమానికి మరణశాసనం రాశారు. సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని నాశనం చేసింది. కార్యక్రమంలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాల ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE