Suryaa.co.in

Andhra Pradesh

నిజాయితీకి నిలువుటద్దం చంద్రబాబు

– టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్నా)

ప్రజల పట్ల అంకితభావంతో పని చేసే దార్శనిక నాయకుడు చంద్రబాబు. బాబు ని రాజకీయంగా ఎదుర్కొనే శక్తిని వ్యక్తులు, జగన్ లాంటి అరాచక శక్తులు ఆక్రమ కేసులు మోపినా నేటి వరకు న్యాయ స్థానాల్లోనూ ఏ ఆరోపణలైనా నిరాధారంగానే మిగిలాయి, హైదరాబాద్, ఐ.ఎయ్.జి భూ కేటాయింపులో అక్రమాలు జరిగాయని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ 2012లో వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఆరోపణల్లో ఆధారాలు లేవని కోర్టు కొట్టివేసింది.

జగన్ మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ అద్యక్షతన రాష్ట్రంలోని క్రిమినల్ అందరూ కలిసి ఒక్కటే సంఘంగా ఏర్పడితే ఆది వైసిపి పార్టీ, అధికారంలో ఉన్నన్ని రోజులు దందాలు, దోపిడీలు, మాఫియాలు నడిపిన వైసిపి నాయకులు, వాటి ప్రశ్నించిన వారి పై దౌర్జన్యాలు, ఆక్రమ కేసులు నమోదు చేశారు, ఎన్నికల్లో ప్రజలు వీళ్ళకు ఓటుతో ఛీ కొట్టినా వీళ్ళ బుద్ధి మారలేదు, నదిలో పడవలు వదిలి ప్రకాశం బ్యారేజి కూల్చడానికి కుట్రచేశారు, ప్రజల ప్రాణాల పట్ల విలువ లేని ఇలాంటి వ్యక్తులు దేశానికి, సమాజానికి చీడ పురుగులు.. కుట్రలు చేసిన వీరందరికీ శిక్షణ తప్పవు.

LEAVE A RESPONSE