Suryaa.co.in

Andhra Pradesh

నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత

-నన్ను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది
-వైఎస్‌ వివేకానందరెడ్డి డ్రైవర్‌ దస్తగిరి

కడప : తనకు ప్రాణభయం ఉందని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి, అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత అని అన్నారు.నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత అని వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి తెలిపాడు.

తనకు ముప్పు తలపెట్టేందుకు కుట్ర జరుగుతోందంటూ పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులంతా సీఎం చెప్పినట్లే వింటారని.. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్ అందరూ ఒకే కుటుంబం అని పేర్కొన్నారు. వివేకా కేసు ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారని.. తనను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉందన్నాడు.పెద్దవాళ్లనే కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తున్నారు.. వారికి నేను లెక్క కాదన్నాడు.

నాకు ప్రాణభయం ఉంది.. రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు తెలిపాడు.గన్‌మెన్లను ఎందుకు మార్చారని ఎస్పీకి ఫిర్యాదు చేస్తే.. నా వ్యాఖ్యలు అసత్యాలని ఎస్పీ చెప్పడం బాధాకరంగా ఉందన్నారు. సమస్య నాది.. ఏం కుట్ర జరుగుతుందో తనకు తెలుసనని వివరించారు.

“నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత. నన్ను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. పెద్దవాళ్లనే కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తున్నారు.. వారికి నేను లెక్క కాదు… నాకు ప్రాణ భయం ఉంది.. రక్షణ కల్పించాలని కోరుతున్నా. సమస్య నాది.. ఏం కుట్ర జరుగుతుందో నాకు తెలుసు.” అని దస్తగిరి పేర్కొన్నారు.

LEAVE A RESPONSE