-కావలిలో నారా లోకేష్
రాష్ట్రానికి మూడు రాజధానులు అని జగన్ రెడ్డి అంటున్నారు. కానీ ఆయన చేసింది 4 రాజధానులు. నాలుగో రాజధాని నెల్లూరు…నెల్లూరుని క్రైం క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు. మర్డర్లు, మానభంగాలు, భూ కబ్జాలు, పోలీసుల హింస కి నెల్లూరు రాజధానిగా మారింది. వాటాలు వేసుకొని నెల్లూరు జిల్లాని పంచేసుకున్నారు వైసిపి నేతలు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న మర్డర్లు, అత్యాచారాలు,
భూకబ్జాలు, పోలీసుల హింస వెనుక ఉన్నది వైసిపి నేతలే. జగన్ రెడ్డి దళిత ద్రోహి. ఆయన సీఎం అయిన మొదటి రోజునుండే దళితులపై దాడులు మొదలయ్యాయి. వైసిపి పాలనలో దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసారు. జగన్ రెడ్డి పాలనలో దళితుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదు. ఓట్లేస్తే అన్ని డోర్ డెలివరీ అన్న జగన్ రెడ్డి గారు దళితుల శవాల్ని డోర్ డెలివరీ చేస్తున్నాడు. ఎస్సి సబ్ ప్లాన్ నిధులు పక్క దారి పట్టించారు. ఎస్సి కార్పోరేషన్ ని నిర్వీర్యం చేసారు. దళితుల అభివృద్ధి కోసం ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసారు. దళిత మేధావులను టార్గెట్ చేసి మరీ చంపుతున్నారు వైసిపి నేతలు.
జగన్ రెడ్డి పరిపాలనలో దళితులకు ప్రశ్నించే హక్కు లేదు. హక్కుల కోసం పోరాడితే చంపేస్తారు. రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు లేదు రాజారెడ్డి రాజ్యాంగం అమలు లో ఉంది. దళితులను చంపిన, హింసించిన ఏ ఒక్క కేసు లోనూ వైసిపి నేతలకు శిక్ష పడలేదు. దళితులు ఎవరైనా ప్రశ్నిస్తే పిచోళ్లనే ముద్ర వేసి వేధించి చంపేస్తున్నారు వైసిపి నేతలు. జగన్ రెడ్డి గారు ప్రైస్ ట్యాగ్ సీఎం. వైసిపి నేతలు మర్డర్లు చేసినా, అత్యాచారాలు చేసినా జగన్ రెడ్డి గారు ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తారు. రేప్ కి ఇంత, మర్డర్ కి ఇంత అని రేటు ఫిక్స్ చేసారు. న్యాయం కోసం పోరాడటానికి లేదు, నిందితుల్ని శిక్షించరు. వారిచ్చిన డబ్బు తీసుకోని నోరుమూసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతుంది ఇదే. విశాఖలో దళిత డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు పిచ్చోడనే ముద్ర వేసి చంపేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడు వరప్రసాద్ అక్రమ ఇసుక రవాణా కి అడ్డుపడ్డాడని వైసిపి నేతలు, పోలీసులు కలిసి గుండు కొట్టించారు. కాకినాడ లో దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసాడు. చీరాల లో దళిత యువకుడు కిరణ్ మాస్క్
పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపేసారు. తిరుపతి లో డాక్టర్ అనితా రాణి వైసిపి అక్రమాలకు సహకరించలేదని వేధించారు. చిత్తూరు లో జే బ్రాండ్ లిక్కర్ దందా గురించి ప్రశ్నించిన దళిత యువకుడు ఓం ప్రతాప్ ని వైసిపి నేతలు చంపేసారు. జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మని అత్యాచారం చేసి చంపేస్తే ఈ రోజు వరకూ కుటుంబానికి న్యాయం జరగలేదు. బకాయిలు చెల్లించమని అడిగినందుకు కానిస్టేబుల్ ప్రకాష్ పై అక్రమ కేసులు పెట్టి సర్వీస్ నుండి తొలగించారు.
వైసిపి ప్రభుత్వ చెత్త నిర్ణయాలను ఎండగడుతున్న మహాసేన రాజేష్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. అతని కారు కూడా లాగేసుకున్నారు. ఇక క్రైం క్యాపిటల్ అఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా లో పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయి. దళితులు, మైనార్టీలు, బీసీలు వైసిపి నేతలు, పోలీసుల చేతిలో బలైపోతున్నారు. కావలిలో ఎంతో భవిష్యత్తు ఉన్న దళిత యువకుడు కరుణాకర్ వైసిపి నేతల వేధింపులకు బలైపోయాడు. ఇది ఖచ్చితంగా వైసిపి నేతల హత్యే. ఊరిలో చెరువు లీజ్ కి తీసుకోని చేపలు పెంచుకున్నాడు. చెరువులో చేపలు పట్టుకొని అమ్ముకోవడానికి వీలు లేదని వైసిపి నేతలు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి అడ్డుకున్నారు. కరుణాకర్, అతని తల్లి వైసిపి నేతలు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి కాళ్లుమొక్కినా వదలలేదు. కులం పేరుతో దూషించారు. మూడేళ్లు వేధించారు. దాదాపు 20 లక్షలు అప్పైయ్యింది. చివరికి వేధింపులు తట్టుకోలేక కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
దళితుల్ని చంపేవారికి వైసిపిలో పదవులు ఇస్తారు. నిందితుల్లో ఒకరైన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్. వైసిపి నేతల వేధింపుల కారణంగా కరుణాకర్ కుటుంబం ఇప్పుడు వీధిన పడింది. కరుణాకర్ కి ఇద్దురు ఆడ బిడ్డలు, భార్య, తల్లి కి అండ లేకుండా పోయింది. కరుణాకర్ హత్య కేసులో జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి ని అరెస్ట్ చేసి పోలీసులు చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ఈ
కేసులో అసలు నిందితుడు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. కరుణాకర్ ని వేధించిన జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి ఎమ్మెల్యే బినామీలే. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతోనే కరుణాకర్ ని వేధించారు. అనేక సార్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గరకి వెళ్లి వేడుకున్నా కరుణాకర్ ని వదిలి పెట్టలేదు. ఎమ్మెల్యే , ఆయన బినామీ షాడో ఎమ్మెల్యే సుకుమార్ రెడ్డి కలిసి ఒక మల్టీప్లెక్స్ కట్టాలి అని ప్లాన్ చేసుకున్నారు. దానికి కరుణాకర్ ఇళ్ళు కూడా కావాల్సి వచ్చింది. ఇళ్ళు లాక్కోవడానికే కరుణాకర్ ని అంతగా వేధించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనే కరుణాకర్ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యే అక్రమాలు అన్ని, ఇన్ని కావు గ్రావెల్ దందా లో కోట్లు కొట్టేస్తున్నారు.
ఇంకా విచిత్రం ఏంటంటే కావలి నియోజకవర్గంలో ఎవరికీ తమ ఆస్తి అమ్ముకునే హక్కు లేదంట. ఎవరైనా అమ్మాలి అనుకుంటే తక్కువ రేటుకి ఎమ్మెల్యే గారికే అమ్మాలి లేకపోతే వేధింపులు తప్పవు. కరుణాకర్ కుటుంబానికి టిడిపి అండగా ఉంటుంది. సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం లో అక్రమంగా దొంగతనం కేసు పెట్టి దళితుడు నారాయణ ను పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపేసారు. కుటుంబసభ్యులను బెదిరించి భౌతిక కాయాన్ని పూడ్చిపెట్టకుండా అడ్డుకున్న పోలీసులు వైసిపి నేతల సహాయంతో దహనం చేసేసారు. ఈ మర్డర్ కి వైసిపి నేతలు కట్టిన రేటు లక్షన్నర. సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో ఒక ఎస్సై వేధించి, వెంటాడి ఇద్దరు మైనార్టీ సోదరులు షాజహాన్, ఉస్మాన్ లను చంపేసాడు.
ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండలంలో ఒక ఎస్సై గీత కార్మికుడు అన్నం చెంచయ్య. దివ్యాంగుడు తిరుపతిలను వేధించి చంపేసాడు. సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, వీరంపల్లి గ్రామంలో ఒక ఎస్సై రైతుని కొట్టి చంపేశాడు. సర్వేపల్లి నియోజకవర్గం జి.వి పాలెం గ్రామంలో వైసిపి నాయకుడు దళితుడు పెంచలయ్య ని హత్య చేసాడు. ఈ కేసులో పోలీసులు కనీసం 302 సెక్షన్ పెట్టలేదు. సర్వేపల్లి నియోజకవర్గం, నాయుడు పాలెం లో వైసిపి కార్యకర్త వేధింపులు తట్టుకోలేక బీసీ యువతి చల్లా అరుణ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మకూరు నియోజకవర్గం మినగల్లు గ్రామస్తుడు వెంగయ్య పై వైసిపి నేతలు దాడి చేసి హత్య చేసారు. టిడిపి నాయకులు నేషనల్ ఎస్సి కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి పోరాడటంతోనే ఆ కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. పరిహారం, పెన్షన్, ఉద్యోగం, ఇంటి స్థలం, పిల్లల చదువుకు సాయం ఇలా అన్ని మన నాయకులు పోరాడిన తరువాతే బాధితుల కుటుంబాలకు వచ్చాయి. నెల్లూరు లో టిడిపి కార్యకర్త సునీత, వాసిరెడ్డి కృష్ణారావు దంపతులను అత్యంత దారుణంగా హత్య చేసారు.
సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం లో 14 ఏళ్ల బాలిక పై వైసిపి కార్యకర్త నాగరాజు యాసిడ్ పోసి గొంతు కోసాడు. నెల్లూరు క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మారడానికి ప్రధాన కారణం ఇక్కడ మంత్రి కాకాణి. గోవర్ధన్ రెడ్డి. కండీషనల్ బెయిల్ కాకాణి అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఆయనకి ప్రాణం విలువ తెలియదు. మంత్రి అయిన మూడో రోజునే ఆయన అపార్ట్మెంట్ లో ఒక ముస్లిం యువకుడు చనిపోతే 3 లక్షల రేటు కట్టాడు. ఆయన అక్రమాలకు సహకరించి, ప్రజల్ని వేధించే పోలీసులను కాపాడటంతో పాటు కావాల్సిన చోట పోస్టింగులు ఇప్పిస్తున్నాడు. నెల్లూరు లో 7గురు రైతులకు చెందిన 4 ఎకరాల 70 సెంట్ల భూమిని కాకాణి కబ్జా చేసారు. 6గురు రిటైర్డ్ ఉద్యోగస్తులకు చెందిన ప్లాట్స్ ని కబ్జా చేసారు. ఫోర్జరీ సంతకాల కేసు, కల్తీ మద్యం కేసులకు కాకాణి బ్రాండ్ అంబాసిడర్. ప్రభగిరి పట్నం మైనింగ్ అంతా కాకాణి ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఎన్నికల ముందు రాయి లేస్తే శవం లేస్తుంది అన్న కాకాణి ఇప్పుడు కొండనే లేపేసాడు. కొండని మింగిన అనకొండ కాకాణి. దళితులపై దాడులు ఆపకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తాం. బాధిత కుటుంబాలకు న్యాయం చెయ్యాలి. దళితులను హత్య చేసిన వైసిపి నేతల్ని కఠినంగా శిక్షించాలి. త్వరలోనే నెల్లూరు జిల్లా లో నాయకులంతా బాధిత కుటుంబాలను పరామర్శించడానికి పాదయాత్ర చేస్తారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులకు శిక్ష తప్పదు. ఇండియన్ పీనల్ కోడ్ అమలు చెయ్యండి…జగన్ పీనల్ కోడ్ అమలు చేస్తే ఇబ్బందులు తప్పవు