* మైపాడుగేట్ వద్ద స్మార్ట్ సిటీలో ఏర్పాటుచేస్తున్న కంటైనర్లను పరిశీలించిన మంత్రి
* కంటైనర్లు తీసుకున్న మెప్మా మహిళలకు సొంత నిధి నుండి ప్రతి మహిళకు రూ. లక్ష చొప్పున సాయం
* మంత్రికు కృతజ్ఞతలు తెలిపిన మెప్మా మహిళలు
* ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం
* మంచి చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఓర్వలేక పోతుంది
– మంత్రి నారాయణ విమర్శ
కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పట్టణ, పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఇందులో భాగంగా మైపాడు గేట్ స్మార్ట్ సిటీ లో ఏర్పాటుచేస్తున్న కంటైనర్లను మంత్రి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. తమ ఆర్థికాభివృద్ధికి షాపులు కేటాయించి, లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసిన మంత్రికి మెప్మా మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.
నెల్లూరు సిటీ లో 1000 మంది మెప్మా మహిళలకు షాపులు కేటాయించాలన్నది తమ లక్ష్యమని.. అందులో భాగంగానే తొలివిడతలో 240 షాపులు ఆమోదం తెలిపామన్నారు. 120 షాపులు ఈ నెలలోనే ప్రారంభిస్తామని.. ఒక్కొ షాపు ఏర్పాటుకు నాలుగు లక్షలు ఖర్చు అవుతోందని తెలిపారు. మెప్మా, కార్పొరేషన్ లనుంచి రెండు లక్షలు సబ్సిడీ వస్తుందని, రెండులక్షలు బ్యాంకు రుణం ఇస్తుందన్నారు. షాపులు తీసుకొన్న మహిళలకు ఒక్కొక్కరికి లక్షరూపాయలు సొంత నిధి నుంచి ఇస్తానన్నారు. బ్యాంకులోను లక్ష రూపాయలే ఉంటుందన్నారు.
చెన్నై బర్మబజార్ లో వ్యాపారాలను పరిశీలించేందుకు మెప్మా మహిళలను పంపించామన్నారు. ఈ ఐదేళ్లలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. వెయ్యి మందికి నా కుటుంబం నుంచి లక్ష రూపాయల చొప్పున ఆర్థికసహాయం అందిస్తానన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను తూచా తప్పక అమలు చేస్తామని, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అభివృద్ధి సంక్షేమం కొనసాగిస్తున్నామన్నారు.
మంచి చేస్తుంటే వైఎస్సార్సీపీ ఓర్వలేకపోతోందని మంత్రి నారాయణ విమర్శించారు. నేను మాటల మంత్రిని కాదని, చేతల తెలిపారు. ఎవరెన్ని చేసినా అభివృధ్యే ధ్యేయంగా ముందుకు సాగుతాను అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, లెక్కల వెంక రెడ్డి, నారాయణ రెడ్డి, శేషమ్మ, రత్నమ్మ, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు. తదితరులు పాల్గొన్నారు.